నేడు యోగ ఏడవ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ.యోగా ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
మహమ్మారి కరోనా కష్టకాలంలో యోగా ప్రజలకు ఆశాకిరణంగా మారిందని చెప్పుకొచ్చారు.యోగా ద్వారా అనేక దేశాలు అదేరీతిలో సమాజం మహమ్మారి నుండి తప్పించుకోవటం జరిగిందని, మహమ్మారి తీసుకొచ్చిన కష్టకాలంలో దేశవ్యాప్తంగా చాలా మంది యోగ సాధకులు గా తయారవటం జరిగిందని తెలిపారు.
ఆరోగ్య ప్రమాణంగా యోగాను మరింత ముందుకు తీసుకెళ్లాలని అనేక కార్యక్రమాలు యోగా ద్వారా రూపొందించాలని తెలిపారు.
యోగాను అలవాటు చేసుకోవటం ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చని, అదే రీతిలో దీర్ఘకాలిక సమస్యల నుండి మానసికంగా శారీరకంగా ఇంకా అనేక రీతులుగా వచ్చే ఇబ్బందులను యోగా ద్వారా ఎదుర్కోవచ్చు అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
మహమ్మారి కరోనా ప్రపంచం లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో దానిని ఎదుర్కోవడానికి ప్రపంచంలో ఏ దేశానికి అవగాహన లేదని తెలిపారు.ఈ నేపథ్యంలో WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ) ద్వారా ఎం-యోగా యాప్ త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.
ఇందులో యోగ కి సంబంధించిన అనేక వీడియోలు లభ్యమవుతాయని పేర్కొన్నారు.