ఉగ్రవాదులకుభారత్ సరైన సమాధానం చెబుతోంది! ప్రధాని మోడీ హెచ్చరిక!

పుల్వామా ప్రాంతంలో శ్రీనగర్ నేషనల్ హైవే పై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులు 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి అందరికీ తెలుసు.ఈ సంఘటనను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి.

 Prime Minister Modi Serious Warning To Terrorists-TeluguStop.com

ఇక ఈ దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ నేరుగా ప్రకటించుకుంది.ఈ నేపథ్యంలో ఉగ్రవాదులపై ప్రతీకార చర్యలు వెంటనే తీసుకోవాలని దేశవ్యాప్తంగా సామాన్యుల నుంచి ప్రముఖులు వరకు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.

ఇక ఉగ్రవాదులు పాల్పడిన ఈ కిరాతకానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్రమంత్రులు ఎప్పటికీ ప్రకటించారు.

ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఘటనపై మాట్లాడేందుకు మీడియా ముందుకు వచ్చారు.

ఈ చర్యకు పాల్పడిన ఉగ్రవాదులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.అమరులైన జవాన్ల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన మోడీ వారి కుటుంబాలకు అండగా నిలబడతామని మాటిచ్చారు.

అలాగే సైన్యం ధైర్య సాహసాల గురించి తనకు పూర్తి నమ్మకం ఉందని, ఈ దాడిపై సరైన సమయంలో సరైన విధంగా సైన్యం తన యాక్షన్ కి సిద్ధమవుతుందని మోడీ తెలియజేశారు.ఎట్టి పరిస్థితుల్లో ఈ దాడికిపాల్పడిన ఉగ్రవాదులు ఉపేక్షించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరికలు పంపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube