పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కావాలని సభ జరగకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేశారు.తాజాగా బీజేపీ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ పార్లమెంటులో కాంగ్రెస్ నీ ఎదుర్కొనే విషయంలో పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ సమావేశాలు జరగకుండా ఉండాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది అంటూ ఆరోపణలు చేశారు.
అందువల్లే పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు అఖిలపక్ష సమావేశానికి కూడా కాంగ్రెస్ నాయకులు రాలేదని దాన్నిబట్టే పార్లమెంటు సమావేశాలు జరగడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు అనేది తెలుస్తుంది అంటూ మోడీ వ్యాఖ్యానించారు.
బిజెపి పార్టీ పార్లమెంటరీ సభ్యుడు ప్రతి ఒక్కరూ నిజానిజాలు మీడియా ముందు మాట్లాడాలని.కాంగ్రెస్ ఆరోపణలు తిప్పికొట్టాలన సమావేశాల అనంతరం తమ తమ ప్రాంతాల్లో కి బీజేపీ ఎంపీలు వెళ్లి చేయాల్సిన పని ఇదే అని మోడీ సూచించారు.