బంగ్లాదేశ్ లో స్వాతంత్ర వేడుకలు లో పాల్గొనటానికి ప్రధాని నరేంద్ర మోడీ ఢాకాకి బయలుదేరారు.రెండు రోజులపాటు బంగ్లాదేశ్ లో పర్యటించ బోతున్నారు.
ఈరోజు రేపు బంగ్లాదేశ్ లో పర్యటించి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక మరియు వాణిజ్య ఇంకా రక్షణ, ఆర్థిక సంబంధాల విషయంలో అనేక ఒప్పందాలు బలోపేతం కోసం ఆ దేశ ప్రధాని షేక్ హసీనాతో ప్రత్యేక చర్చలు జరపనున్నారు.
కరోనా వైరస్ బయటపడిన తర్వాత ఇప్పటివరకు ప్రధాని మోడీ ఎలాంటి విదేశీ పర్యటన చేపట్టలేదు.
తాజాగా మహమ్మారి వచ్చిన కొద్ది నెలల తర్వాత పరిస్థితులు కాస్త కంట్రోల్ లోకి రావటం మాత్రమే కాక వ్యాక్సిన్ లు కూడా అందుబాటులోకి ఉండటంతో సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మోడీ కోవిడ్ వచ్చిన తర్వాత తొలి విదేశీ పర్యటన బంగ్లాదేశ్ కావడంతో ఈ వార్త అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.బంగ్లాదేశ్ కి స్వాతంత్రం రావడం లో భారత్ ఎంతో కీలక పాత్ర పోషించింది.
ఇలాంటి తరుణంలో ఆ దేశ స్వాతంత్ర వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొనటం విశేషం.