ప్రధాని మోడీ ఐదు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే.నిన్న ప్రత్యేక విమానం ద్వారా అమెరికా కు బయల్దేరిన మోడీకి వాషింగ్టన్ లో ఘన స్వాగతం లభించింది.
ఈ క్రమంలో ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఫుల్ బిజీగా ఉన్నారు.డిజిటల్ ఇండియా సహకారం దిశగా.
కొంతమంది కీలక వ్యక్తులతో ప్రధాని మోడీ భేటీ అవుతున్నారు.ఈరోజు వాషింగ్టన్.
లోని ద విల్డార్డ్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్ వేదికగా అడోబ్ సీఈవో శంతను నారాయణ్, క్వాల్ కామ్ సీఈవో క్రిస్టియానోl ఇ అమోన్, వివేక్ లాల్ (జనరల్ అటామిక్స్), మార్క్ విడ్మార్ (ఫస్ట్ సోలార్), స్టీఫెన్ ఏ ష్వార్జ్ మాన్ (బ్లాక్ స్టోన్)లతో సమావేశాలు నిర్వహించారు.
ఇండియాలో 5g సేవలు మరియు ఇతర సాంకేతిక సేవలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో మోడీ చర్చించడం జరిగింది.
ఇదిలా ఉంటే త్వరలోనే మోదీ ప్రభుత్వం కొత్త ఆరోగ్య స్కీమ్ను ప్రకటించనున్నది.ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ను ప్రకటించడానికి సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దేశంలో ప్రతి పౌరుడి వ్యక్తిగత ఆరోగ్య వివరాలు ఈ ఐడి లో పొందు పరుస్తూ సరికొత్త విధానాన్ని దేశంలో తీసుకురావడానికి రెడీ అవుతున్నట్లు ఈ కొత్త డిజిటల్ హెల్త్ మిషన్ సెప్టెంబర్ 27 వ తారీఖున మోడీ ప్రకటించనున్నట్లు సమాచారం.