కర్ణాటకలోని తుమ్మకూరులో దేశంలోనే అతిపెద్ద హెలికాప్టర్ ఫ్యాక్టరీనీ ప్రధాని మోడీ ప్రారంభించారు.615 ఎకరాలలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కేంద్రం నుండి భారీ ఎత్తున హెలికాప్టర్ లు తయారు కానున్నాయి.హెలికాప్టర్ కి సంబంధించి ప్రతి పార్ట్ ఇక్కడి నుంచె తయారు చేసే విధంగా ఈ సెంటర్ ను రూపొందించారు.దీంతో మొదటి సంవత్సరం 30 హెలికాప్టర్లు… రెండవ సంవత్సరం 60 ఆ తర్వాత సంవత్సరం 90.హెలికాప్టర్ లు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ కానున్నాయి.
ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా కేంద్రం ఈ హెలికాప్టర్ ఫ్యాక్టరీని నిర్మించడం జరిగింది.
ఈ ఫ్యాక్టరీకి 2016లో ప్రధాని మోడీ శంకుస్థాపన చేయగా నేడు ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం అయింది.ఈ హెచ్ఏఎల్ హెలికాప్టర్ తయారీ కేంద్రంలో..హెలి -రన్ వే, ఫ్లైట్ హ్యాంగర్, ఫైనల్ అసెంబ్లీ హ్యాంగర్, స్ట్రక్చర్ అసెంబ్లీ హ్యాంగర్, ఎయిర్ కంట్రోల్, వివిధ సపోర్టింట్ సర్వీస్ లు అందుబాటులో ఉండనున్నాయి.