రాజ్యసభ వేదికగా కాంగ్రెస్పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ప్రధాని సభలో ప్రసంగిస్తుండగా అదానీ వ్యవహారంపై మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
విపక్షాల నిరసనలే మధ్యనే మాట్లాడిన ప్రధాని మోదీ… విపక్షాల తీరు చూస్తుంటే బాధేస్తోందన్నారు.సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే సభలో ఇలా వ్యవహారిస్తారా అని ప్రశ్నించారు.
ప్రజా సమస్యలపై చర్చించాలనే ఆలోచన విపక్షాలకు లేదని మండిపడ్డారు.
దేశ ప్రగతిని కాంగ్రెస్ నాశనం చేసిందని మోదీ ఆరోపించారు.
సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ఎప్పుడూ ప్రయత్నించలేదని చెప్పారు.కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు.
తమ దృష్టి అంతా అభివృద్ధిపైనే ఉందన్న మోదీ అసలైన లౌకికతత్వం అంటే ఏంటో తాము చూపించామని తెలిపారు.దేశ ప్రజల విశ్వాసం గెలుచుకున్నామని, సామాన్యుడి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని మోదీ స్పష్టం చేశారు.