ఆ ఎంపీ భుజం తట్టిన ప్రధాని ! షాక్ తిన్న వైసీపీ

కొద్ది రోజులుగా నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై పార్టీ అధిష్టానం గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.ఆయన బిజెపి వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానంతో ఆయనపై నిఘా పెట్టడమే కాకుండా ఫోన్లో వివరణ కూడా తీసుకున్నారు.

 Prime Minister Modhi Wishing To Mp Ragurama Krishnamraju-TeluguStop.com

ఈ సందర్భంగా వైసీపీ ఎంపీలకు జగన్ నేరుగా మీరు ఎవరు ప్రధాని నరేంద్ర మోదీని కల వద్దంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు.అలా చెప్పి కొద్ది రోజులు గడవక ముందే నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రఘురామకృష్ణంరాజు భుజంపై చేయి వేసి మరి అభినందించడం చర్చనీయాంశమైంది.

పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈ సంఘటన జరిగింది.ప్రధాని నరేంద్ర మోదీ సెంట్రల్ హాల్లో వస్తుండగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎదురయ్యారు.

ప్రధానిని చూడగానే వినయ పూర్వకంగా రఘురామకృష్ణంరాజు నమస్తే సార్ అంటూ పలకరించారు.దీంతో మోదీ రాజుగారు అంటూ కరచాలనం చేశారు.

నవ్వుతూ ఆప్యాయంగా తన చాంబర్ వైపు వెళ్లిపోయారు.ఆ సమయంలో కృష్ణం రాజు తో పాటు ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , ఆదాల ప్రభాకర్ రెడ్డి మరికొంత మంది ఎంపీలు ఉన్నారు.

వారంతా ఒక్కసారిగా ఈ హఠాత్పరిణామానికి షాక్ తిన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube