గుడిలో గబ్బుపని చేసిన పూజారి

గుడిలో నిత్యం పూజలు చేసే ఓ పూజారి బుద్ధి వక్రించడంతో పవిత్ర దేవాలయంలో పాడుపని చేయబోయాడు.తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గుంటూరు జిల్లా అమరాతి మండలం వైకుంఠపురం గ్రామంలోని ఓ ఆలయంలో చోటు చేసుకుంది.

 Priest Misbehaves With Woman In Temple-TeluguStop.com

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.విజయవాడకు చెందిన దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠపురంలోని ఆలయానికి విచ్చేసి సంతానం కోసం పూజలు నిర్వహించారు.

ఈ క్రమంలో పూజారి ఆ మహిళతో ఒంటరిగా మాట్లాడాలని చెప్పి ఆమెను ఏకాంతంగా కలిశాడు.ఈ క్రమంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు ఆ పూజారి.దీంతో ఆ మహిళ అతడిని ఎదురించి, గట్టిగా కేకలు వేసింది.అంతే ఆ పూజారి అక్కడి నుండి దెబ్బకు పారిపోయాడు.

ఈ ఘటనను ఆ దంపతులు గ్రామంలో చెప్పి వెళ్లిపోయారు.కాగా గ్రామస్తులు ఆ పూజారిపై ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఓ మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించి పరారీలో ఉన్న ఆ పూజారిపై దేవాదాయ అధికారులు రహస్యంగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.మరి ఈ ఘటనపై వారు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube