టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే.ఇలా పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ప్రభాస్ కి అరుదైన గౌరవం లభించింది.
ఈయన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్లతో కలిసి ఒకే వేదికపై సందడి చేసే అవకాశం లభించింది.దేశ రాజధాని ఢిల్లీలో రాంలీల్ మైదానంలో జరిగే రావణ దహనానికి హాజరుకావాలంటూ ప్రభాస్ కి ఆహ్వానం అందింది.
ఈ క్రమంలోనే రామ్ లీలా మైదాన కమిటీ నుంచి ప్రభాస్ కి ఈ ఆహ్వానం అందడంతో ప్రభాస్ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని సమాచారం.ఇప్పటివరకు ఎన్నోసార్లు ఇలా రావణ దహనం జరిగినప్పటికీ ఏ హీరోకి కూడా ఇలాంటి అవకాశం రాలేదు మొదటిసారి ఎలా సౌత్ ఇండస్ట్రీ నుంచి ప్రభాస్ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.
ప్రతి ఏడాది రాంలీల్ మైదానంలో ఎంతో అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమం గత రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణంగా జరగలేదు.
ఈ క్రమంలోనే ఈ ఏడాది రావణ దహనాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.అయితే ఈ కార్యక్రమానికి ప్రభాస్ హాజరు కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష్ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే రావణ దహనానికి ప్రభాస్ కి ప్రత్యేక ఆహ్వానాన్ని పంపినట్లు తెలిసింది.ఇలా ప్రభాస్ కు అరుదైన గౌరవం దక్కడంతో అభిమానుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.