విజయవాడ కనకదుర్గమ్మ కు ఏపీ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పణ

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ఈ ఉత్సవాలలో భాగంగా నేడు మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 Presentation Of Silk Cloths To Vijayawada Kanakadurgamma By Ap Govt-TeluguStop.com

ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.వేద మంత్రోచ్ఛారణల మధ్య పసుపు కుంకుమలు కూడా అందజేశారు.

అంతకుముందు దుర్గ గుడిలో సీఎం జగన్ కు వేద పండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో సీఎం వెంట మంత్రులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube