విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ఈ ఉత్సవాలలో భాగంగా నేడు మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.వేద మంత్రోచ్ఛారణల మధ్య పసుపు కుంకుమలు కూడా అందజేశారు.
అంతకుముందు దుర్గ గుడిలో సీఎం జగన్ కు వేద పండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో సీఎం వెంట మంత్రులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.