కరోనా టైంలో ఇప్పుడు అందరూ ఇళ్ల వద్దే ఉంటున్నారు.బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండటం వల్ల ఉద్యోగులు కూడా ఇంటి పట్టునే ఉంటూ తమ పనులను చేసుకుంటున్నారు.ఈ టైంలో అందరికీ స్మార్ట్ ఫోన్ అత్యంత విలువైన వినోద సాధనంగా మారింది.
చాలా మంది స్మార్ట్ ఫోన్ తో కాలక్షేపం చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు.సోషల్ మీడియాను ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు.ప్రపంచ జనాభాలో దాదాపు 3.96 బిలియన్లు అంటే 58.11 శాతం మంది సోషల్ మీడియాలో ఎక్కువ సమయం కాలక్షేపం చేస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.తమ ఇంట్లో ఏం జరిగినా తమ ప్రాంతంలో అనేక విషయాలను, సంఘటనలను సోషల్ మీడియాలతో పంచుకోవడం ఈ మధ్య సాధారణ విషయం అయిపోయింది.
తాజాగా ఇటలీకి చెందిన జోష్, లిసా ఫేస్బుక్ పేజీలో షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఓ మహిళ హాక్ స్టెప్ ట్యుటోరియల్ ద్వారా రెండు డబ్బాల పాస్తా సాస్ పోసి సాస్పై మీట్బాల్స్, బ్రెడ్, సలాడ్స్ ఇంకా కొన్ని పదార్థాలను కలిపి స్పఘెట్టి పాస్తాను తయారు చేసింది.
అయితే ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు 27 మిలియన్లకు పైగా నెటిజన్లు వీక్షించారు.ఈ విధంగా బల్లపై తయారు చేసే ఈ ఆహారాన్ని చూసి నెటిజన్లు షాక్కు గురవుతున్నారు.“నేను మీ ఇంటికి విందు కోసం వస్తే.మర్యాదగా నాకు వద్దని చెప్తాను.అయినా దీన్ని ఎవరూ కూడా తినరు” అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.” మీరు తయారు చేసిన విధానం చాలా అపరిశుభ్రంగా ఉంది.మీకు నాస్టీస్ట్ డిన్నర్ అవార్డు ఇవ్వాలి” అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.“నా కళ్ళు! నా కళ్ళు!” అంటూ మరొకరు ఆందోళన చెందుతున్నట్టు పోస్ట్ చేశారు.