కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి బాగా చేరువ అయిన మలయాళీ నటి ప్రేమి విశ్వనాథ్.ఈ ఒక్క సీరియల్ తో హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది.
తెలుగు టెలివిజన్ రంగంలో అత్యధిక రేటింగ్స్ తో సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న సీరియల్స్ లో కార్తీక దీపం కూడా ఒకటిగా ఉంది.ఇక ఈ సీరియల్ తీసుకొచ్చిన క్రేజ్ తో ప్రేమి విశ్వనాథ్ ఏకంగా ఓ ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో లీడ్ రోల్ కూడా చేసే అవకాశం సొంతం చేసుకుంది.
అయితే నటిగా ఈ స్థాయిలో ఆమె గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం భర్త ఇచ్చిన సపోర్ట్ అనేది ఆమెని ఫాలో అవుతున్న వారు చెప్పే విషయం.ఇదిలా ఉంటే తెలుగులో ఆమెకున్న క్రేజ్ పక్కన పెడితే ఇప్పుడు ఆమె భర్త నిర్మాతగా టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు.
సుమంత్ హీరోగా అనగనగా ఒక రౌడీ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో వాల్తేరు శీను అనే రౌడీ పాత్రలో సుమంత్ కనిపించబోతున్నాడు.
ఇక ఈ సినిమాతో మను యజ్ఞ దర్శకుడుగా పరిచయం అవుతూ ఉండగా దీనికి ఒక నిర్మాతగా ప్రేమి విశ్వనాథ్ భర్త వినీత్ భట్ ఉన్నారు.వినీత్ భట్ కి ప్రముఖ ఆస్ట్రాలజర్ గా దేశ వ్యాప్తంగా పేరుంది.
ఎంతో మంది సెలబ్రిటీలకి అతను ఆస్ట్రాలజర్ గా వ్యవహరిస్తున్నారు.ఇప్పుడు సుమంత్ సినిమాతో నిర్మాతగా కూడా అడుగులు వేస్తున్నారు.
సుమంత్ పుట్టినరోజు సందర్భంగా ప్రేమి విశ్వనాథ్ అతనికి బర్త్ డే విషెస్ కూడా చెప్పింది.ఈ సందర్భంగా సుమంత్ తన అభిమాన హీరో అని పేర్కొంది.
దీనిని బట్టి ప్రేమి విశ్వనాథ్ అభ్యర్ధన మేరకు సుమంత్ సినిమాకి అతను నిర్మాతగా వ్యవహరిస్తున్నాడనే టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తుంది.