కార్తీకదీపం సీరియల్ తో ఓవర్ నైట్ లో పాపులారిటీని సంపాదించుకున్న ప్రేమీ విశ్వనాథ్ ఈ సీరియల్ ద్వారా రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ ను సొంతం చేసుకోవడంతో పాటు క్రేజ్ ను మరింత పెంచుకుంటున్నారు.కార్తీకదీపం సీరియల్ సక్సెస్ తో ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్న ప్రేమీ విశ్వనాథ్ త్వరలో నిర్మాతగా మారనున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఓన్ ప్రొడక్షన్ హౌస్ పనుల్లో ఈమె బిజీగా ఉన్నారని బోగట్టా.
రాబోయే రోజుల్లో ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ప్రాజెక్ట్ లను నిర్మించాలని ప్రేమీ విశ్వనాథ్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది.ప్రేమీ విశ్వనాథ్ భారీ ప్రాజెక్ట్ లను నిర్మించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారని తెలుస్తోంది.మరోవైపు కార్తీకదీపం2 కచ్చితంగా ఉంటుందని మేకర్స్ చెబుతుందని ఫస్ట్ పార్ట్ ను మించిన కథతో సెకండ్ పార్ట్ తీయడం కష్టమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ప్రేమీ విశ్వనాథ్ తెలుగు భాషకు ఎంతగానో ప్రాధాన్యత ఇస్తున్నారు.
తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా ప్రేమీ విశ్వనాథ్ కు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.సీరియళ్ల ద్వారా ప్రేమీ విశ్వనాథ్ కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని బోగట్టా.ప్రేమీ విశ్వనాథ్ కెరీర్ ప్లానింగ్ ఇతర సీరియల్ హీరోయిన్లకు భిన్నంగా ఉంది.
మంచి కంటెంట్ తో తెరకెక్కే సీరియళ్లలో ఆమె నటిస్తున్నారు.చైతన్య హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో కూడా ప్రేమీ విశ్వనాథ్ కనిపించనున్నారని తెలుస్తోంది.
ప్రేమీ విశ్వనాథ్ కు స్టార్ హీరోల సినిమాలలో కూడా ఆఫర్లు వస్తున్నా ఆమె ఆ ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది.వంటలక్క మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదని ప్రొడక్షన్ హౌస్ తో ఆమె ఊహించని స్థాయిలో లాభాలను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.