ప్రస్తుతం సౌత్ హీరోలు అందరూ బాషా పరిమితులు లేకుండా అన్ని రాష్ట్రాల ప్రజలకి తమ సినిమా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నారు.అలాగే అన్ని బాషలలో మార్కెట్ పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో తమ రేంజ్ కూడా పెరుగుతుందని హీరోలు ఆ దిశగా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇప్పటి వరకు కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ మార్కెట్ పై దృష్టి పెట్టి తమ సినిమాలని తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు.ఇలా రిలీజ్ చేసి సక్సెస్ అయ్యి టాలీవుడ్ లో కూడా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న కోలీవుడ్ హీరోలు ఉన్నారు.
వారిలో రజినీకాంత్, కమల్ హసన్, సూర్య, కార్తి, అజిత్, విశాల్, విజయ్ లాంటి స్టార్స్ అందరూ ఉన్నారు.వీరి దారిలోనే విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్ కూడా వస్తున్నారు.
అలాగే కన్నడ నాట ఉపేంద్ర, సుదీప్ లకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది.మలయాళంలో మోహన్ లాల్ సినిమాలకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది.
ఈ మధ్య మోహన్ లాల్ స్ట్రైట్ తెలుగు సినిమాలు కూడా చేయడంతో అతని మార్కెట్ మరింత పెరిగింది.
ఇదిలా ఉంటే మలయాళీ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా మహానటితో టాలీవుడ్ లో అడుగుపెట్టడంతో అతనికి ఇక్కడ ఇమేజ్ పెరిగింది.ఈ నేపధ్యంలో దుల్కర్ సినిమాలు తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ అవుతున్నాయి.ఇక ఇప్పుడు మరో మలయాళీ స్టార్ టాలీవుడ్ మార్కెట్ పై దృష్టి పెట్టాడు.
ప్రేమమ్ సినిమాతో మలయాళంలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ స్టార్ నివిన్ పోలీ.ఈ సినిమాలో సౌత్ లో హాట్ టాపిక్ అయ్యింది.
ఈ మూవీతోనే సాయి పల్లవి హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది.ఈ మూవీని అదే పేరుతో నాగ చైతన్య హీరోగా తెలుగులో రీమేక్ చేశారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రేమమ్ కాంబినేషన్ లో మళ్ళీ మూవీ తెరకెక్కుతుంది.అయితే ఈ మూవీ రీమేక్ రైట్స్ కోసం ఇప్పటికే టాలీవుడ్ నిర్మాతలు సంప్రదించిన ఒరిజినల్ నిర్మాత, దర్శకుడు మాత్రం మలయాళంతో పాటు తెలుగులో ఈ మూవీని ఒకే సారి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఈ కారణంగానే రీమేక్ రైట్స్ ఇవ్వడానికి వారు ఒప్పుకోలేదని టాక్.ప్రేమమ్ మూవీతో నివిన్ పోలీ తెలుగు ప్రేక్షకులకి కూడా పరిచయం అయిన నేపధ్యంలో అదే బ్రాండ్ తో ఈ మూవీని టాలీవుడ్ లో ప్రమోట్ చేసి ఏ స్థాయిలో స్పందన ఉంటుందో తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు బోగట్టా.