ప్రస్తుతం యూఏఈ దేశంలో ఐపీఎల్ 13 సీజన్ జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే.ఇందులో భాగంగానే కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు యజమాని ప్రీతిజింతా టీంతో సహా అక్కడే బస చేస్తోంది.
ఐపీఎల్ పూర్తిగా బయోపిక్ వాతావరణంలో నిర్వహిస్తోంది బీసీసీఐ.ఇందులో భాగంగానే తాజాగా ప్రీతిజింత తాను యూఏఈ చేరుకున్న అప్పటినుంచి మొత్తం చాలా సార్లు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నట్లు తెలిపింది.
ఐపీఎల్ లో కరోనా రాకుండా ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటున్నారు.ఇందులో భాగంగానే ప్రీతిజింతా తాజాగా మరోసారి తన టెస్ట్ ను చేయించుకుంది.తాజాగా ఇందులో భాగంగానే కరోనా టెస్ట్ శాంపిళ్లను సేకరిస్తున్న వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసింది.అందులో భాగంగానే తాను ఇప్పటివరకు 20 సార్లు కరోనా టెస్టులు చేయించుకున్నట్లు వివరించంది.
అంతేకాదు తానిప్పుడు కోవిడ్ టెస్ట్ క్వీన్ అయిపోయా అంటూ చెప్పుకువచ్చింది.తన దగ్గర టెస్ట్ సాంపిల్స్ సేకరిస్తున్న వైద్య సిబ్బందికి ఎంత ఓపిక ఉందో నాకైతే అర్థం అవ్వట్లేదు.
వాళ్లను నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అంటూ తెలియజేసింది.
ఇకపోతే చాలామంది బయో బబుల్ అంటే ఏంటని అడుగుతున్నట్లు చెప్పుకో వచ్చింది.
అయితే అందుకు సమాధానంగా పూర్తిగా బయో బబుల్ లోకి ప్రవేశించాలంటే ముందుగా క్వారంటైన్ ను పూర్తి చేసుకొని టెస్టులు నెగటివ్ గా అని తేలితే బయో బబుల్ లోకి ప్రవేశం ఉంటుందని తెలిపింది.ఆ తర్వాత బయట వాళ్ళతో కాంటాక్ట్ అసలు అవ్వకూడదని, అలాగే వారికి కేటాయించిన గదులలో మాత్రమే ఉండాలని.
అంతేకాకుండా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆటగాళ్లు అలాగే సిబ్బంది ప్రయాణించిన ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.అలాగే ఒకసారి ఎవరైనా ఈ నిబంధన అతిక్రమించినట్లు తెలిసిన వారు మళ్ళీ క్వారంటైన్ పూర్తి చేసుకోవాలని తెలిపింది.
ప్రస్తుతం ప్రీతిజింత సినిమాలకు దూరంగా ఉండు తన వ్యాపారాలలో దూసుకు వెళ్తుంది.