తెలుగులో ప్రముఖ దర్శకుడు జెఫ్రీ గి చిన్ మోసగాళ్ళు అనే చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా నటించగా హీరో అక్క పాత్రలో కాజల్ అగర్వాల్, ఇతర పాత్రలలో యంగ్ హీరో నవదీప్, నవీన్ చంద్ర, సీనియర్ హీరో జగపతి బాబు తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు ప్రెస్ మీట్ లో పాల్గొని ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇందులో భాగంగా మొదటగా ఈ చిత్రంలో తన అక్క పాత్రలో నటించిన కాజల్ అగర్వాల్ స్థానంలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ప్రీతి జింటా ని నటింపజేయాలని అనుకున్నట్లు తెలిపాడు.
కానీ అనివార్య కారణాల వల్ల ఆమె ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించలేదని దాంతో కాజల్ అగర్వాల్ కి ఈ కథను చెప్పడంతో ఆమె వెంటనే ఓకే చేసిందని చెప్పుకొచ్చాడు.అంతేగాక టాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ తనకి అక్క పాత్రలో నటించినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని మరియు ఓ స్టార్ హీరోయిన్ అక్క పాత్రలో నటించాలంటే చాలా ఆలోచిస్తారని కానీ కాజల్ అగర్వాల్ తన కోసం ఏమీ ఆలోచించకుండా ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకుందని అందుకు ధన్యవాదాలు కూడా తెలిపాడు.
అలాగే ఈ చిత్రంలో ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రలకి 100% న్యాయం చేశారని అందుకు పేరు పేరునా చిత్ర యూనిట్ సభ్యులకి కృతజ్ఞతలు తెలియజేశాడు.అంతేకాక అప్పట్లో అక్క తమ్ముడు కలిసి చేసిన స్కామ్ అనే వాస్తవిక సంఘటన ద్వారా ఈ చిత్రాన్ని తెరకెక్కింఛామని కాబట్టి కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశా భావం వ్యక్తం చేసాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ చిత్రం మార్చి 19వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.ఇటీవలే ఈచిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా మంచి స్పందన లభించింది.
అంతేగాక ఈ చిత్రాన్ని చూసిన కొందరు సినిమా సెలబ్రిటీలు కూడా మంచు విష్ణు కి అభినందనలు తెలియజేస్తున్నారు.దీంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అలాగే ఈ చిత్రం దాదాపుగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, తదితర నాలుగు భాషలలో ప్రసారం కానుంది.పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసిన మంచు విష్ణు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడు చూడాలి.