మనిషితత్వం మరిచిపోయి మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు కొందరు.పశువల్లా మారి తమ కోరిక తీర్చుకుంటున్నారు అంటే పశువులు కూడా అసహ్యించుకుంటాయేమో.
ఆరు నెలల పసిగుడ్డు నుండి అరవై ఏళ్ల ముసలమ్మల వరకు ఎవరిని వదిలి పెట్టట్లేదు కామోన్మాదులు.ఇప్పడు ఏకంగా ఒక నోరులేని మూగజీవిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ,దాని చావుకి కారణం అయ్యారు.
కలవరపెడుతున్న ఈ ఘటన వివరాలు.
మరోదా గ్రామానికి చెందిన అస్లు అనే వ్యక్తికి మేకలు ఉన్నాయి.కొద్ది రోజుల క్రితం తన మేకల్లో ఒకటి అదృశ్యమైనట్లు గుర్తించిన అస్లు.దాన్ని వెతకడం మొదలుపెట్టాడు.
ఒక చోట తన మేకపై కొంత మంది యువకులు లైంగిక చర్యకు పాల్పడటం చూసి షాకయ్యాడు.గట్టిగా అరవడంతో వాళ్లంతా అక్కడి నుంచి పారిపోయారు.
తీవ్ర రక్తస్రావంతో మేక అక్కడే చనిపోయి పడిఉంది.వెంటనే గ్రామస్థుల సాయంతో పోలిసులకు ఫిర్యాదు చేసాడు అస్లు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు.ఆ ముగ్గురు అదే గ్రామానికి చెందిన సవాకర్, హరూన్, జాఫర్లు.
మరో ఐదుగురు పరారిలో ఉ:డగా వారి కోసం గాలిస్తున్నారు.
డ్రగ్స్ కి అలవాటు పడిన నిందితులు ఆ మత్తులోనే మేక ఒంటరిగా ఉన్నప్పుడు దానిని లైంగికంగా హింసించి తమ పాశవిక కోర్కె తీర్చుకున్నారు.గర్భిణి అయిన మేకతో అసహజ లైంగిక చర్యకు పాల్పడి దాని మరణానికి కారణమైన ఘటనపై జంతు హక్కుల సంస్థ ‘పెటా’ తీవ్రంగా స్పందించింది.నిందింతులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
దేశంలో రోజు రోజుకి అత్యాఛారాలు పెరిగిపోతున్నాయి.ఆఖరుకి నోరులేని మూగజీవాలు కూడా బలికావల్సి వస్తుంది.
అమ్మాయిలపై ఘటనలకు నిర్భయ చట్టం తెచ్చినప్పటికి ఏం లాభం లేకపోయింది.ఇప్పుడు ఈ మూగజీవాలకి న్యాయం జరిగేనా…
.