ప్రస్తుతం గర్బనిరోదకంకు పలు పద్దతులు అమలులో ఉన్నాయి.అందులో ప్రధానంగా కండోమ్ కాగా, రెండవది గర్బనిరోదక పిల్స్.
ఈ గర్బ నిరోదక పిల్స్ కేవలం అమ్మాయిలు మాత్రమే వాడుతారు.గర్బం రాకుండా ఉండేందుకు శృంగారంలో పాల్గొన్న సమయంలో వాటిని వేసుకుంటారు.
గర్బనిరోదక మాత్రలు మహిళలు అధికంగా వాడటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.కొందరు అమ్మాయిలు వాటిని వేసుకోవడంకు భయపడుతున్నారు.
ఇలాంటి సమయంలో అబ్బాయిలకు గర్బనిరోదక పిల్స్ను తయారు చేశారు.
గర్బనిరోదక పిల్స్ మగవారు వేసుకున్న సమయంలో వారిలోని వీర్యం ఉత్పత్తి ఆగిపోతుంది.శుక్ర కణాలు పూర్తిగా ఆగిపోతాయి.చాలా సంవత్సరాల క్రితమే మగవారికి గర్బనిరోదక పిల్స్ వచ్చాయి.
వాటిని మార్కెట్లోకి మాత్రం విడుదల చేయడం లేదు.కొన్ని వందల మందిపై గర్బనిరోదక మాత్రలను పరీక్షించిన శాస్త్రవేత్తలు ఇప్పుడు మాత్రం వాటిని వదలేందుకు కాస్త వెనుకంజ వేస్తున్నారు.
ఇప్పటి వరకు ప్రయోగించిన ప్రతి ఒక్కరికి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.అయినా కూడా ఎందుకు విడుదల చేయడం లేదు అనేది ప్రస్తుతం ఆసక్తికర విషయం.
మగవారి గర్బనిరోదక మాత్రలు వీర్యం విడుదల తగ్గించడంతో పాటు, శుక్రకణాలను ఎక్కువగా విడుదల కాకుండా చూస్తుంది.ప్రస్తుతంకు అది ఓకే అవ్వచ్చు.కాని భవిష్యత్తులో వీర్యం విడుదల కాకుండా ఉండటం, శుక్ర కణాల విడుదల కాకపోతే ఆ తర్వాత పరిస్థితి ఏంటీ అనేది శాస్త్రవేత్తలను భయపెడుతుంది.మగవారికి గర్బనిరోదక మాత్రలు ఎక్కువగా వాడితే వారి పురుషత్వంకు కూడా పోయే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అందుకే పురుషుల గర్బనిరోదక మాత్రలు మంచిది కాదని అంటున్నారు.