మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రతిరోజూ పండగే మంచి అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది.ఈ సినిమాకు తొలిరోజే మంచి టాక్ రావడంతో పాటు పాజిటివ్ రివ్యూలు రావడంతో సినిమాకు బాగా కలిసొచ్చింది.
పోటీలో నందమూరి బాలకృష్ణ రూలర్ చిత్రం ఉన్నప్పటికీ అది బాక్సాఫీస్ వద్ద దారుణమైన టాక్ను సొంతం చేసుకుంది.
దీంతో ప్రేక్షకులు ప్రతిరోజూ పండగే సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరిచారు.
ఇక ఈ సినిమా తొలి వీకెండ్ హౌజ్ఫుల్ షోలతో సందడి చేయగా వీక్ డేస్లోనూ కలెక్షన్ల పరంగా డ్రాప్ కాకుండా నిలబడింది.దీంతో ఈ సినిమా ఫస్ట్ వీక్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.19.94 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలి వారం ముగిసే సరికి రూ.17.14 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
పూర్తి ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో తేజు సరసన రాశిఖన్నా హీరోయిన్గా నటించింది.
రావు రమేష్, సత్యరాజ్ వంటి నటులు ఈ సినిమాకు బాగా హెల్ప్ అయ్యారు.దర్శకుడు మారుతి ఎంచుకున్న కథ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో విజయం సాధించింది.
ఇక ఏరియాల వారీగా ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 7.35 కోట్లు
సీడెడ్ – 2.11 కోట్లు
నెల్లూరు – 0.54 కోట్లు
కృష్ణా – 1.24 కోట్లు
గుంటూరు – 1.20 కోట్లు
వైజాగ్ – 2.55 కోట్లు
ఈస్ట్ – 1.23 కోట్లు
వెస్ట్ – 0.92 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 17.14 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.10 కోట్లు
ఓవర్సీస్ – 1.70 కోట్లు
టోటల్ వరల్డ్వైడ్ కలెక్షన్స్ – 19.94 కోట్లు
.