మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు.సుప్రీం హీరో అనే బిరుదును కూడా సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో గతకొంతకాలంగా వరుస ఫ్లాపులతో అల్లాడిపోయాడు.
ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఆరు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు.అయితే మారుతి పుణ్యమా అని ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా మనోడి ఖాతాలో పడింది.
ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్కు బాగా కనెక్ట్ కావడం, బాక్సాఫీస్ వద్ద మరే సినిమా పోటీలో లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది.అంతేగాక ఈ సినిమా తేజు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యిందంటే ఫ్యామిలీ ఆడియెన్స్ను ఈ సినిమా ఎంతమేర ఆకట్టుకుందో చెప్పొచ్చు.
తేజు కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ ఈ సినిమా సాధించి పెట్టడంతో సాయి ధరమ్ తేజ్ సంతోషంగా ఉన్నాడు.
ప్రతిరోజూ పండగే సినిమా రిలీజ్ అయ్యి మూడు వారాలు దాటినా ఈ సినిమాకు ఇంకా కొన్ని చోట్ల ప్రేక్షకాదరణ లభిస్తుండటం విశేషం.ఈ సినిమా మూడు వారాలు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.33.12 కోట్లు సాధించింది.రాశి ఖన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా మూడు వారాల షేర్ కలెక్షన్లు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 12.22 కోట్లు
సీడెడ్ – 3.88 కోట్లు
నెల్లూరు – 0.88 కోట్లు
కృష్ణా – 2.02 కోట్లు
గుంటూరు – 1.91 కోట్లు
వైజాగ్ – 4.74 కోట్లు
ఈస్ట్ – 1.99 కోట్లు
వెస్ట్ – 1.50 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 29.14 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 2.05 కోట్లు
ఓవర్సీస్ – 1.93 కోట్లు
టోటల్ వరల్డ్వైడ్ – 33.12 కోట్లు
.