కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ సినిమా తో ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు.కే జి ఎఫ్ సినిమా సెన్సేషనల్ సక్సెస్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న కే జి ఎఫ్ 2 సినిమా కూడా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ అంతా నమ్మకం గా వెయిట్ చేస్తున్నారు.
ఈ సమయంలోనే టాలీవుడ్ హీరోలు పలువురు ఆయనపై కర్చీఫ్ వేసేందుకు ప్రయత్నాలు చేశారు.అందులో భాగంగా కొందరికి ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది.
తదుపరి సినిమా ఎవరితో అనే విషయమై చర్చ జరుగుతున్న సమయంలో నేడు ప్రశాంత్ ఒక ఆసక్తికర ట్వీట్ చేయడం జరిగింది.హీరో యశ్ తో ఉన్న ఫోటోను షేర్ చేసిన ఒక నెటిజన్ కి సమాధానం ఇస్తూ బెంగళూరు అండ్ హైదరాబాద్ కాలింగ్ నెక్స్ట్ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఈ ట్వీట్ కి అర్థం ఏమై ఉంటుందో అంటూ అంతా జుట్టు పీక్కుంటున్నారు.కే జి ఎఫ్ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.ఆ సినిమా షూటింగు హైదరాబాదులో చేయబోతున్నారా లేదంటే తదుపరి సినిమా హైదరాబాద్ హీరో చేయబోతున్నాడా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి ప్రశాంత్ హైదరాబాదు అని ట్వీట్ చేసిన నేపథ్యంలో అందరిలో ఆసక్తి నెలకొంది.
ఏం జరగబోతోంది ప్రశాంత్ నీల్ హైదరాబాదు నెక్స్ట్ అంటూ ఎందుకు ట్వీట్ చేశాడు అనేది చర్చనీయాంశంగా మారింది.ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేయాల్సి ఉంది.
అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్ పూర్తి అవ్వాలి, ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా పూర్తి కావాలి.అప్పుడు ప్రశాంత్ కు డేట్లు ఇచ్చే అవకాశం ఉంది.
దానికి చాలా సమయం ఉండగానే ప్రశాంత్ నెక్స్ట్ హైదరాబాద్ అంటూ ట్వీట్ చేయడం అందరికీ ఆశ్చర్యం గా ఉంది.ఎన్టీఆర్ తో కాకుండా ముందు మరే హీరోతో అయినా ఆయన సినిమా ఉంటుందా అనే చర్చ కూడా జరుగుతోంది.