కేజీఎఫ్ సినిమాతో దర్శకుడిగా పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాను చేస్తున్నాడు.ఆ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలోనే విడుదల చేయబోతున్నారు.
ఇక తదుపరి సినిమాను ప్రభాస్ తో ఇప్పటికే ప్రశాంత్ నీల్ ప్రకటించాడు.సలార్ సినిమా షూటింగ్ ను వచ్చే ఏడాదిలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ నటించబోతుండగా కీలక పాత్రలో రానా మరియు మోహన్ లాల్ లు నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇదే సమయంలో కొత్త నటీ నటులను దాదాపుగా 15 మందిని తీసుకునే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం షూటింగ్ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు.కేవలం హైదరాబాద్లోనే కాకుండా చెన్నై మరియు బెంగళూరులో కూడా ఆడిషన్స్ ను చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు.
కేజీఎఫ్ 2 సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ చేయబోతున్న సినిమా అవ్వడం వల్ల సలార్ పై అంచనాలు ఆకాశమే హద్దుగా ఉన్నాయి.ఇలాంటి నేపథ్యంలో ప్రశాంత్ చేస్తున్న ప్లానింగ్ ఎవ్వరికి అర్థం కావడం లేదు.భారీ యాక్షన్ సీన్ లు ఉంటాయని చెప్పడంతో పాటు బీభత్సమైన యాక్షన్ సీన్స్ ఉంటాయని చెబుతున్నారు.దాంతో ఖచ్చితంగా సినిమా మరో రేంజ్ లో ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
కనుక సినిమాకు చాలా సమయం పడుతుంది.కాని ప్రశాంత్ నీల్ మాత్రం కేవలం ఏడాది కాలంలోనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు.అతి త్వరలోనే సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని కూడా భావిస్తున్నారు.
సినీ ప్రముఖులు సైతం అసలు ప్రభాస్ తో సలార్ అంటూ ప్రశాంత్ నీల్ ఏం చేయబోతున్నాడు అంటున్నారు.సలార్ ను ప్రశాంత్ నీల్ ఒక మిస్ట్రరీ ఫిల్మ్ గా తీయబోతున్నట్లుగా అనిపిస్తుంది.