కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ నుండి మొదలుకుని ఆగస్టు వరకు సినిమాలు అన్ని కూడా వాయిదా పడ్డాయి.పదుల సంఖ్యలో సినిమాలు విడుదల వాయిదా పడటంతో ప్రేక్షకులు జుట్టు పీక్కుంటున్నారు.
రేపటి నుండి జూన్ నెల ప్రారంభం కాబోతుంది.ఓటీటీ రిలీజ్ తప్ప థియేటర్ రిలీజ్ జూన్ లో కూడా లేదని క్లారిటీ వచ్చేసింది.
పెద్ద ఎత్తున జులై అయినా సినిమాలు వస్తాయేమో అంటూ ఎదురు చూస్తున్నారు.తెలుగు సినిమాలు కొన్ని జులై లో విడుదల చేస్తామని చెప్పినా ఇప్పుడు వెనక్కు తగ్గాయి.
కాని కేజీఎఫ్ 2 మాత్రం వెనక్కు తగ్గడం లేదు.జులై లో అన్నట్లుగానే కేజీఎఫ్ 2 ను విడుదల చేస్తామని దర్శకుడు ప్రశాంత్ నీల్ అంటున్నాడు.
సినిమా చిత్రీకరణ పూర్తి అవ్వడంతో పాటు వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా దాదాపుగా పూర్తి అయ్యింది.సినిమా చిత్రీకరణ మొదలు అయినప్పటి నుండి కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది.
కాని ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం అవ్వకూడదనే నిర్ణయానికి వచ్చారు.
కేజీఎఫ్ 2 సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి నెలలు గడుస్తోంది.
దాంతో ఇప్పటికే ఆలస్యం అయ్యింది.ఇకపై ఆలస్యం చేయకూడదనే నిర్ణయానికి వచ్చారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ కోసం పలు సినిమాలు ఎదురు చూస్తున్నాయి.కాని లాక్ డౌన్ ఎత్తివేసినా కూడా సినిమా విడుదల చేయాలనే ఉద్దేశ్యంలో మాత్రం ఎవరు లేరు.
కాని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రమే తన సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.
పెద్ద ఎత్తున ఈ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు.రికార్డు బ్రేకింగ్ వసూళ్లతో కేజీఎఫ్ సూపర్ హిట్ అందుకుంది.కనుక కేజీఎఫ్ 2 కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.
కేజీఎఫ్ 2 ను ఇప్పటి వరకు అయితే వాయిదా వేయలేదు కనుక జులై లోనే ఆ సినిమా వస్తుందనే నమ్మకంతో అంతా ఉన్నారు.