కేజీఎఫ్ సినిమా తో ఒక్కసారిగా స్టార్ డం ను దక్కించుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు.ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కించేందుకు అడ్వాన్స్ తీసుకున్నాడు.
ఆ తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా ను కూడా ఈ దర్శకుడు చేయాల్సి ఉంది.ఇంకా పలువురు టాలీవుడ్ హీరోలతో కూడా తెలుగులోనే ఆయన సినిమా లు చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
వరుసగా తెలుగు లో సినిమా లు చేస్తున్న ప్రశాంత్ నీల్ మళ్లీ కన్నడంలో సినిమాలు చేయక పోవచ్చు అంటున్నారు.ఆయన కన్నడంలో సినిమాలు చేస్తే పారితోషికం 10 కోట్లను మించి వచ్చే అవకాశం లేదు.
అక్కడి సినిమాల మార్కెట్ ను బట్టి ఆయన పారితోషికం చాలా తక్కువగా ఉంటుంది.కాని ఆయన తెలుగు లో మాత్రం సినిమా చేస్తే ఏకంగా పాతిక కోట్ల వరకు కూడా పారితోషికంను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
అందుకే ఆయన తెలుగులోనే సినిమాను చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
కరోనా కారణంగా సలార్ ను మద్యలోనే నిలిపి వేసిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ మూవీ కోసం స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడు.
మరో వైపు కేజీఎఫ్ 2 సినిమాను కూడా విడుదల చేసేందుకు రెడీ చేస్తున్నాడు.మన తెలుగు దర్శకుల మాదిరిగా ఒక సినిమా విడుదల తర్వాతే మరో సినిమా అన్నట్లుగా కాకుండా ఒకదాని తర్వాత ఒకటి విడుదలకు ముందే పట్టాలెక్కిస్తున్నాడు.
సలార్ విడుదల< అయ్యేంత వరకు ఆగకుండానే ఎన్టీఆర్ తో మూవీ కూడా పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ప్రస్తుతం సినిమా కు సంబందించిన అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
టాలీవుడ్ బిగ్ మార్కెట్ ఉన్న కారణంగా ఇక్కడ సినిమాలు చేయాలని ఆయన భావిస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.