ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు తీయగల సమర్థులు ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లు రాజమౌళి, శంకర్ మరియు ప్రశాంత్ నీల్.వీరు మాత్రమే సౌత్ లో మరియు నార్త్ లో కూడా అద్బుత వసూళ్లను దక్కించుకోగలరు.
అందుకే ఈ ముగ్గురితో సినిమా లను నిర్మించేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు.వారు ఒప్పుకోవాలే కాని వందల కోట్లతో సినిమా లను నిర్మించేందుకు పదుల కొద్ది నిర్మాతలు సిద్దంగా ఉన్నారు.
ఈ ముగ్గురి దర్శకత్వం లో నటించేందుకు అందరు హీరోలు కూడా సిద్దంగా ఉంటారు.కనుక వీరిని బుట్టలో వేసుకోవాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం వరుసగా తెలుగు నిర్మాతలకు బుక్ అవుతున్నాడు.ఇప్పటికే దిల్ రాజు బ్యానర్ లో ఈయన చేస్తాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అల్లు అరవింద్ కూడా అడ్వాన్స్ ఇచ్చాడంటూ వార్తలు వస్తున్నాయి.ఈ సమయంలోనే మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రశాంత్ నీల్ మూవీని కన్ఫర్మ్ చేశారు.
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఒక సినిమా పట్టాలెక్కబోతుంది.అది వచ్చే ఏడాది కి పట్టాలెక్కబోతుంది.అయినా కూడా ఇప్పుడే భారీ అడ్వాన్స్ ను మేకర్స్ ప్రశాంత్ నీల్ కు ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.ఇప్పటి వరకు కేజీఎఫ్ మరియు సలార్ సినిమా లకు తీసుకున్న పారితోషికం ను మించి ప్రశాంత్ నీల్ కు మైత్రి మూవీ మేకర్స్ పారితోషికం ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పాతిక కోట్ల రూపాయలతో పాటు షేర్ రూపంలో మరో 15 నుండి 20 కోట్ల రూపాయలను ఇవ్వబోతున్నారు.సినిమా విడుదల అయ్యి ఏమాత్రం సక్సెస్ అయినా కూడా మరో అయిదు నుండి పది కోట్ల వరకు ఆయనకు పారితోషికంను ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి ఈ పారితోషికం 50 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు.సౌత్ లో ఈ రేంజ్ పారితోషికం అంటే మామూలు విషయం కాదు.
అందుకే మైత్రి వారికి మనోడు ఓకే చెప్పాడని తెలుస్తోంది.