ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఓడిపోవచ్చు అంటూ జోస్యం చెప్పారు.దేశంలో వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ క్రమంలో చాలా వరకు ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాగాని 2024 సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో బీజేపీ ఓడిపోయే అవకాశం ఉందని ఎన్.డి.టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.బీజేపీ గద్దె దిగాలి అంటే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న పార్టీతో అది సాధ్యం కాదని స్పష్టం చేశారు.
దేశ వ్యాప్తంగా హిందుత్వం నినాదంతో పాటు జాతీయ స్థాయిలో సంక్షేమ పథకాలతో బిజెపి ఎన్నికల కు వెళ్తుందని వీటిలో రెండిటినీ ప్రతిపక్షాలు ధీటుగా ఎదుర్కొంటే… 2024 ఎన్నికలలో బీజేపీ ఇంటికి వెళ్లిపోవడం గ్యారెంటీ అని చెప్పుకొచ్చారు.ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాక మిగతా పార్టీలు ప్రతిపక్షంగా ఏర్పడితే.
ఇది పెద్ద అసాధ్యం కాదని స్పష్టం చేశారు.ఇక కాంగ్రెస్ పార్టీలో కూడా కొత్త వారికి అవకాశం ఇచ్చి ప్రక్షాళన కార్యక్రమం ఆ పార్టీ పెద్దలు చేస్తే ఇది ఖచ్చితంగా సాధ్యమని.
జాతీయ చానల్లో ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారు.