వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రజా సమస్యల తో పాటు దేశాన్ని కుదిపేస్తున్న పెగాసిస్ స్పైవేర్ పై చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.లోక్ సభ అదే రీతిలో రాజ్యసభలో ప్రతిపక్షాలు మిగతా విషయాలను పక్కన పెట్టి పెగాసిస్ స్పైవేర్ పై చర్చ జరపాలని ఆందోళనలు నిరసనలు చేపడుతూ ఉన్నాయి.
ఇటువంటి తరుణంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా పెగాసిస్ స్పైవేర్ పై సంచలన కరమైన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల తన ఫోన్ అనేకమార్లు హ్యాకింగ్ కి గురవటం జరిగిందని స్పష్టం చేశారు.అందువల్ల ఇప్పటికి ఐదు సార్లు తన ఫోన్ మార్చినట్లు అయినా సరే హ్యాకింగ్ కి గురవుతూనే ఉందని సంచలన కరమైన కామెంట్లు చేశారు.ఈనెల 14న హ్యాకింగ్ కి గురైనట్లు ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం తేలింది అని.చెప్పుకొచ్చారు.ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం అయిన సమయంలో చర్చలు జరుగుతున్న టైంలో తన ఫోన్ హ్యాకింగ్ కి గురైనట్లు స్పష్టం చేశారు.