రాజకీయ నాయకుడు గా ప్రశాంత్ కిషోర్ ఎంతగా రాణించారు అంటే చెప్పలేము కానీ, రాజకీయ వ్యూహకర్తగా మాత్రం ఆయన సక్సెస్ రేటు ను చూసుకుంటే నూటికి 99 శాతం ఉన్నట్లే అని చెప్పాలి.2014 ఎన్నికల్లో ప్రధాని మోడీ కి, 2015 లో బీహార్ సీఎం నితీశ్ కుమార్, 2017 పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్, అలానే 2019 ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇలా అందరికీ ఆయన రాజకీయ వ్యూహకర్త గా వ్యవహరించి వారికి అధికారాలను కట్టబెట్టారు.అంతటి సక్సెస్ రేటు ఉన్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తమిళరాజకీయాలలో తన వ్యూహాన్ని రచించనున్నారు.ప్రస్తుతం ఆయన ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్కు వ్యూహకర్తగా ఉన్న సంగతి తెలిసిందే.
తాజాగా ప్రశాంత్ కిశోర్కి చెందిన ‘ఐప్యాక్’ సంస్థతో డీఎం కే పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ తో కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయాన్నీ స్టాలిన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
2021లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఐప్యాక్ సంస్థ తమకు సేవలందిస్తుందని తెలిపారు.2021 ఎలక్షన్స్లో తమ పార్టీ ప్రణాళికకు మెరుగులు దిద్ది తమిళనాడుకు పూర్వ వైభవం తెచ్చేందుకు సహాయపడతారని స్టాలిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.