ఇక స్టాలిన్ కు కూడా అందనున్న పీకే సేవలు

రాజకీయ నాయకుడు గా ప్రశాంత్ కిషోర్ ఎంతగా రాణించారు అంటే చెప్పలేము కానీ, రాజకీయ వ్యూహకర్తగా మాత్రం ఆయన సక్సెస్ రేటు ను చూసుకుంటే నూటికి 99 శాతం ఉన్నట్లే అని చెప్పాలి.2014 ఎన్నికల్లో ప్రధాని మోడీ కి, 2015 లో బీహార్ సీఎం నితీశ్ కుమార్, 2017 పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్, అలానే 2019 ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇలా అందరికీ ఆయన రాజకీయ వ్యూహకర్త గా వ్యవహరించి వారికి అధికారాలను కట్టబెట్టారు.అంతటి సక్సెస్ రేటు ఉన్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తమిళరాజకీయాలలో తన వ్యూహాన్ని రచించనున్నారు.ప్రస్తుతం ఆయన ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్‌కు వ్యూహకర్తగా ఉన్న సంగతి తెలిసిందే.

 Prashanth Kishore Jagan Nithish Kumar-TeluguStop.com

తాజాగా ప్రశాంత్ కిశోర్‌కి చెందిన ‘ఐప్యాక్‌’ సంస్థతో డీఎం కే పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ తో కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయాన్నీ స్టాలిన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Telugu Jagan, Nithish Kumar, Pk Stalin, Stalin-Telugu Political News

2021లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఐప్యాక్‌ సంస్థ తమకు సేవలందిస్తుందని తెలిపారు.2021 ఎలక్షన్స్‌లో తమ పార్టీ ప్రణాళికకు మెరుగులు దిద్ది తమిళనాడుకు పూర్వ వైభవం తెచ్చేందుకు సహాయపడతారని స్టాలిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube