దేశంలో ఎన్నికల వ్యూహకర్తగా మంచి ట్రాక్ రికార్డు కలిగిన ప్రశాంత్ కిషోర్ తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.ఈ భేటీలో ప్రియాంక గాంధీ కూడా పాల్గొనడం జరిగింది.
ఇటీవల చాలా వరకు దేశంలో జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ డీల్ సెట్ చేసుకున్న పార్టీలు అధికారంలోకి రావడం తెలిసిందే.పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలుపు వెనకాల ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కూడా ఉన్నాయి.
చాలావరకు బిజెపికి వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ దేశంలో పలు రాష్ట్రాల ఎన్నికలకు ఆయా పార్టీలకు ఎన్నికలకు వ్యూహకర్తగా రాణిస్తున్నారు.ఇటువంటి తరుణంలో త్వరలో పంజాబ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో పీకే భేటీ కావడం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది.
ఒకవేళ డీల్ సెట్ అయితే. ఒక్క పంజాబీ ఎన్నికలకు మాత్రమేనా లేకపోతే 2024 సార్వత్రిక ఎన్నికలకు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా పీకే పని చేస్తున్నాడా.? అన్నది సస్పెన్స్ గా మారింది.
.