అకస్మాత్తుగా వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేస్తుండడం, దీనిపై పెద్ద రాజకీయ దుమారం చోటు చేసుకోవడం, ఉదయం నుంచి కొనసాగుతూనే ఉంది.ప్రస్తుతం లోటస్ పాండ్ వద్ద పెద్ద ఎత్తున షర్మిల, వైఎస్ అభిమానులు చేరుకోవడం, పార్టీకి సంబంధించిన విధివిధానాలపై కీలకమైన సన్నిహితులతో షర్మిల చర్చిస్తున్నారు.
ఇప్పటికే పార్టీ ఆ పార్టీ విధానాలపై ఒక క్లారిటీ వచ్చింది.కాకపోతే జగన్ పై ఉన్న కోపంతో పార్టీ పెడుతున్నారా ? ఆస్తి తగాధాలా లేక ఈ పార్టీ ఏర్పాటు వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారా ? లేక జగన్ భార్య భారతితో తగాదాలా అనే విషయంపై ఇంకా స్పష్టత ఇప్పటికీ రాలేదు.రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకపోవడంతో నే ఈ విబేధాలు అనే అనేక ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.అయినా షర్మిల నోరు విప్పలేదు.
కొత్త పార్టీ ఏర్పాటుపై షర్మిల చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.అంతే కాదు తెలంగాణ లో వైఎస్ అభిమానుల అండదండలతో, రాజన్న రాజ్యం తీసుకువస్తానని అప్పుడే ఆమె ప్రకటించేశారు.
అప్పుడే తెలంగాణకు చెందిన వైఎస్ అభిమానులు చాలా మంది షర్మిల పార్టీకి అండగా నిలబడేందుకు సిద్ధమైపోయారు.ఇక షర్మిల పార్టీ ఏర్పాటు నిర్ణయం ఆషామాషీగా జరగలేదని, దీని వెనుక పెద్ద కసరత్తే జరిగినట్లుగా తెలుస్తోంది.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ గా పేరుపొందిన కెవిపి రామచంద్ర రావు, వైయస్ నీడ గా గుర్తింపు పొందిన సూర్యుడు, ఇంకా జగన్ పక్కన పెట్టిన చాలామంది నాయకులు షర్మిల వెంట నడుస్తున్నట్టు సమాచారం.ఇక పార్టీ ఏర్పాటు కు సంబంధించిన మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తోంది షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమారట.
అలాగే ఏపీ లో వైసిపి ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన శాయశక్తులా కృషి చేసిన ఆ పార్టీ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ సైతం షర్మిల పార్టీకి వ్యూహరచన చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుండడం సంచలనంగా మారింది.తెలంగాణ లో షర్మిల పార్టీ ఏర్పాటు చేయడం వల్ల ప్రత్యక్షంగా జగన్ కు జరిగే నష్టం ఏమీ లేకపోయినా, పరోక్షంగా మాత్రం జగన్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.తెలంగాణలో చెల్లాచెదురు అయిపోయిన వైఎస్ అభిమానులు అంతా ఇప్పుడు షర్మిల పార్టీ వైపు చూస్తూ ఉండడం, మిగతా రాజకీయ పార్టీలలో చేరలేక ఇబ్బందులు పడుతున్న వారికి షర్మిల పార్టీ ప్రత్యామ్నాయం గా కనిపిస్తోంది.అయితే షర్మిల పార్టీని వెనకుండి నడిపిస్తున్న వారి సమాచారం బయటకి పొక్కకుండా చాలా జాగ్రత్తలే తీసుకున్నా, చాలా విషయాలు బయటికి రావడం సంచలనంగా మారింది.