కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో దేశీయ,అంతర్జాతీయ విమానయాన సర్వీసులు రద్దయ్యాయి కూడా.
అయితే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ నుంచి కోల్ కతా కు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.ఆయన ఢిల్లీ నుంచి కోల్ కతా కు కార్గో విమానంలో ప్రయాణించారు అంటూ వార్తలు హల్ చల్ చేస్తుండడం తో ఈ వార్తలపై కేంద్రం ఆరా తీస్తుంది.
అసలు ఢిల్లీ నుంచి ఆయన కోల్ కతా కు వెళ్లారా,వెళితే ఎలా వెళ్లారు అన్న దానిపై కేంద్రం ఆరా తీస్తుంది.ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆహ్వానించడం తో ఆయన కోల్ కతా వెళ్లినట్లు తెలుస్తుంది.
‘లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ప్రశాంత్ కిశోర్ కార్గో విమానంలో ప్రయాణించడానికి ప్రయత్నించారా అనే దానిపై విచారణ జరుపుతున్నాం.దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వాలని అన్ని విమానాశ్రయాలను కోరాం’ అని పౌర విమానయాన శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే మరోపక్క తాను కార్గో విమానంలో కోల్కతా వెళ్లినట్టు వస్తున్న వార్తలను ప్రశాంత్ కిశోర్ ఖండిస్తున్నారు.మార్చి 19 తర్వాత తాను ఏ విమానాశ్రయానికి వెళ్లలేదని తెలిపిన ఆయన తాను విమానంలో ప్రయాణించినట్టు ఎవరి దగ్గరైనా వివరాలు ఉంటే మాత్రం వెంటనే బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు.
అయితే అసలు ఆయన ఢిల్లీ నుంచి కోల్ కతా ఎలా వెళ్లారు అన్న దానిపై కేంద్రం దృష్టి పెట్టింది.