ఏపీ పాలిటిక్స్ లో రాజకీయ యుద్ధం అంతా ప్రధానంగా వైసిపి, జనసేన మధ్య జరుగుతున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.అధికార పార్టీ ఏ చిన్న తప్పు చేసినా ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం కంటే ఎక్కువగా జనసేన రియాక్ట్ అవుతోంది.
ప్రజా ఉద్యమాలు చేస్తూ ఎక్కడలేని హడావుడి చేస్తోంది జనసేన.ఇదంతా రాబోయే రోజుల్లో పార్టీకి మంచి ఊపు తెచ్చేందుకు బాగా ఉపయోగపడుతుందని పవన్ ఒక రకమైన అభిప్రాయంలో ఉన్నారు.
అయితే ఇది ఇలా ఉండగా ఇప్పుడు జనసేన కు మెగాస్టార్ చిరంజీవి రూపంలో ఓ కొత్త చిక్కు వచ్చి పడింది.జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులు తాను అనుకూలం అంటూ చిరంజీవి ప్రకటించారు.
దీనిపై రాజకీయ కలకలం రేగడంతో అదంతా ఫేక్ అంటూ జనసేన పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, చిరు దాన్ని ఖండించినట్టుగా ఓ లెటర్ బయటకి రావడంతో అంతా గందరగోళంలో పడ్డారు.మళ్ళీ దీనిపై చిరంజీవి క్లారిటీ ఇస్తూ జగన్ నిర్ణయానికి తాను మద్దతు ఇస్తున్నాను అని మరోమారు క్లారిటీగా చెప్పడంతో జనసేన చిక్కుల్లో పడింది.
దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసిపి కొత్త ఎత్తుగడలను మొదలు పెట్టింది.మామూలుగానే జనసేన పార్టీ, టిడిపి పార్టీ కానీ ఏదైనా చిన్న పొరపాటు మాట మాట్లాడితే వైసిపి సోషల్ మీడియాలో రకరకాల వ్యంగ్యాస్త్రాలు, వెటకారాలు చేస్తూ ట్రోలింగ్ చేస్తుంది.
ప్రస్తుతం జనసేన, చిరు మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో సోషల్ మీడియాలో చిరు పవన్ ఫ్యాన్స్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.ఈ ఇద్దరి ఫ్యాన్స్ రెండుగా విడిపోయి ఒకరికి మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.
అయితే ఇందులో కొంత వరకు వాస్తవం ఉంది.అయితే అసలు ఈ వ్యవహారం వెనుక వైసిపి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నట్టుగా జనసేన అనుమానిస్తోంది.
ఎన్నికల ముందు వరకు వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా పని చేసి పక్కకు తప్పుకున్న ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీం కొద్దిరోజుల కిందట జగన్ కు పరిపాలనలో కూడా తగిన సహాయ సహకారాలు అందించేందుకు ఒప్పందం చేసుకుంది.దీనిలో భాగంగానే పీకే టీం రంగంలోకి దిగి పోయింది.
సోషల్ మీడియాలో జనసేన, చిరు ఫ్యాన్స్ కు చెందిన అకౌంట్ల వలే ఫేక్ అకౌంట్స్ సృష్టించి ఒకరికి మద్దతుగా మరొకరిని విమర్శిస్తూ పోస్ట్లు పెడుతూ చిరు పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా చిరు, పవన్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టడం ద్వారా జనసేనను మరింత బలహీనం చేయాలి అన్న ఆలోచనకు పదును పెట్టినట్టుగా తెలుస్తోంది.