బాలీవుడ్ హీరో హ్యాండ్ ఇవ్వడంతోనే అ! సీక్వెల్ ఆగింది అంటున్న ప్రశాంత్ వర్మ

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రీసెంట్ గా జాంబీరెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది.

 Prasanth Varma Open Up On Awe Movie Sequel, Tollywood, Bollywood, South Cinema,-TeluguStop.com

జాంబియన్స్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ మూవీని తెరపై ఆవిష్కరించారు.దీనికి సీక్వెల్ ని సమంతతోతెరకెక్కిస్తానని ఇప్పటికే ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు.

ఇక సీక్వెల్ కి సంబంధించి కథ కూడా రెడీ అయిపోయిందని గతంలో చెప్పాడు.ఇదిలా ఉంటే లాక్ డౌన్ సమయంలో ప్రశాంత్ వర్మ వరుసగా రెండు వెబ్ సిరీస్ లు లైన్ లో పెట్టాడు.

ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ కోసం ఓ కథని రెడీ చేసి ఫైనల్ చేసుకున్నాడు.అలాగే మరో ఛానల్ కోసం కూడా వెబ్ సిరీస్ ని సిద్ధం చేస్తున్నాడు.

ఇదిల ఉంటే తాజా ఓ ఇంటర్వ్యూలో తన సినిమాల గురించి క్లారిటీ ఇచ్చాడు.
తన మొదటి సినిమా అ! సీక్వెల్ ఉంటుందని గతంలో ప్రకటించాడు.

అయితే అది సెట్స్ పైకి వెళ్లకపోవడానికి కారణం చెప్పాడు.ఆ సీక్వెల్ ని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలని ఒక బాలీవుడ్ స్టార్ ని సంప్రదించి కథ కూడా నేరేట్ చేయడం జరిగిందని చెప్పాడు.

అయితే అతను కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో సీక్వెల్ ఆగిందని క్లారిటీ ఇచ్చాడు.అయితే జాంబీ రెడ్డి సీక్వెల్ మాత్రం కచ్చితంగా ఉంటుందని, సమంతాతోనే దానిని తెరకెక్కిస్తానని చెప్పాడు.

అలాగే పౌరాణికంలో సోషియో ఫాంటసీ కథని తెరకెక్కించడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాడు.అయితే దానిని తెరపై ఆవిష్కరించడానికి కావాల్సినంత అనుభవం ఇంకా రాలేదని కచ్చితంగా వీలైనంత వేగంగా వర్క్ నేర్చుకొని తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకొని వెళ్తానని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube