యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జోంబీ రెడ్డి’ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న సంగతి తెలిసిందే.గతంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘అ’ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.
ఈ సినిమాతో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈ డైరెక్టర్ ప్రస్తుతం ‘జోంబీ రెడ్డి’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను ఇటీవల రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమా టైటిల్పై ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఓ సరికొత్త వివాదం రేగింది.రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఈ సినిమా టైటిల్ ఉందని, వెంటనే ఈ సినిమా టైటిల్ను మార్చాలంటూ చిత్ర యూనిట్పై కొందరు మండిపడుతున్నారు.
అయితే ఈ వివాదంపై చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా క్లారిటీ ఇచ్చాడు.ఈ సినిమాను కేవలం ఎంటర్టైనర్గా మాత్రమే తెరకెక్కి్స్తున్నామని, ఇందులో ఎలాంటి సామాజిక వర్గాన్ని కించపరిచే అంశాలు లేవని చిత్ర దర్శకుడు తెలిపాడు.
కరోనా లాంటి మహమ్మారి రాయలసీమలోని కర్నూలు ప్రాంతంలో ప్రబలినప్పుడు అక్కడి ప్రజలు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు, తమ విజయాన్ని ప్రపంచానికి ఎలా చాటి చెప్పారనేది ఈ సినిమా కథ అని ప్రశాంత్ వర్మ తెలిపాడు.
మొత్తానికి ఈ చిత్ర టైటిల్ విషయంలో క్లారిటీ ఇచ్చే క్రమంలో సినిమా కథను కూడా రివీల్ చేశాడు ప్రశాంత్ వర్మ.
ఇక ఈ సినిమాలోని నటీనటుల గురించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.కాగా టాలీవుడ్లో ఇప్పటివరకు రాని కాన్పెస్టుతో ఈ సినిమా వస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.