యంగ్ టాలెంటెడ్ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి ప్రశాంత్ వర్మ.ఈ దర్శకుడు రీసెంట్ గా జాంబీరెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.
తెలుగులో ఫస్ట్ జాంబియన్స్ జోనర్ లో వస్తున్న సినిమా కావడంతో పాటు, దర్శకుడు చిత్రాన్ని భాగా ప్రమోట్ చేయడంతో ఎక్కువ జనాల్లోకి రీచ్ అయ్యింది.దానికోతోడు జాంబీరెడ్డి అంటూ రాయలసీమ బ్యాక్ డ్రాప్ తీసుకొని సినిమాని తెరకెక్కించడంతో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక రిలీజ్ తర్వాత మంచి టాక్ సొంతం చేసుకొని సినిమాకి డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి.ఏకంగా ఈ సినిమా 15 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.
ఓ విధంగా ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా లోబడ్జెట్ తో విజువల్ ట్రీట్మెంట్ తెరకెక్కించిన ఈ సినిమాకి 15 కోట్లు కలెక్షన్స్ అంటే హిట్ అయినట్లే.ఈ సినిమాతో చైల్డ్ యాక్టర్ తేజ సజ్జా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
అలాగే బస్ స్టాప్ సినిమాలో నటించిన ఆనంది చాలా గ్యాప్ తర్వాత మరల తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది.
ఇదిలా ఉంటే జాంబీరెడ్డి హిట్ అయితే దానికి సీక్వెల్ చేస్తానని ప్రశాంత్ వర్మ ఆ సినిమా ప్రమోషన్ టైంలోనే ఎనౌన్స్ చేసేశాడు.
అవకాశం ఉంటే సమంతతో సీక్వెల్ చేస్తానని కూడా చెప్పుకొచ్చాడు.అయితే సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఉంది.
ఈ నేపధ్యంలో ఈ ఏడాది మరో సినిమాలో నటించే అవకాశం లేదనే చెప్పాలి.అయితే ప్రశాంత్ వర్మ మాత్రం సమంత లేకపోయినా కూడా జాంబీరెడ్డి సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళడం పక్కా అని క్లారిటీ ఇచ్చేశాడు.
దాంతో పాటు ఈ ఏడాదిలోనే స్టార్ట్ చేసి డిసెంబర్ ఎండ్ కి రిలీజ్ కూడా చేస్తానని తాజాగా మీడియాతో చెప్పుకొచ్చాడు.