టాలీవుడ్లో హీరోలకంటే కూడా కంటెంట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు.కానీ వారి సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుండటంతో వారు తెరకెక్కించే సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
ఈ జాబితాలో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఒకరు.తన తొలి చిత్రం ‘అ!’తో తెలుగు ప్రేక్షకులకు కొత్తదనాన్ని పరిచయం చేసిన ఈ డైరెక్టర్, ఆ ఒక్క సినిమాతో ఇండస్ట్రీ చూపును తనవైపు తిప్పుకున్నాడు.
ఆ తరువాత కల్కి అనే సినిమాతో మనముందుకు వచ్చిన ప్రశాంత్ వర్మ, ఈ సినిమాతో రాజశేఖర్కు అదిరిపోయే సక్సెస్ను అందించాడు.కాగా ప్రస్తుతం కరోనా వైరస్పై ఓ సినిమా చేస్తున్న ప్రశాంత్ వర్మ, ఈ సినిమాకు సంబంధించిన ప్రీలుక్ పోస్టర్ను రిలీజ్ చేశాడు.
నిజానికి ఈ సినిమా దేశంలో కరోనా వైరస్ ప్రవేశించక ముందు నుండే తెరకెక్కిస్తున్నాడు ఈ డైరెక్టర్.కాగా తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్ భయంకరంగా ఉండటంతో ప్రేక్షకులు ఇది హార్రర్ సినిమా అయి ఉండవచ్చిన భావిస్తున్నారు.
కర్నూలు కొండారెడ్డి బురుజును పెట్టిన పోస్టర్లో ‘కరోనా కేవలం ఆరంభం మాత్రమే’ అనే క్యాప్షన్తో ఈ సినిమాపై మరిన్ని అంచనాలను క్రియేట్ అయ్యేలా చేశాడు.
మొత్తానికి ప్రశాంత్ వర్మ మరోసారి దమ్మున్న సబ్జెక్ట్తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
మరి ఈ సినిమాలో నటీనటులు ఎవరనే విషయం పక్కనబెడితే, ఈ సినిమా ఎలాంటి కథతో ప్రేక్షకులను మెప్పిస్తుందా అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఏదేమైనా ప్రశాంత్ వర్మ కేవలం కంటెంట్నే ఎందుకు నమ్ముకుంటాడో ఈ సినిమాతో మరోసారి నిరూపించుకోవాలని చూస్తున్నాడు.
కాగా ప్రశాంత్ వర్మ చిత్రానికి సంబంధించిన ఈ ప్రీలుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.