కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయగా, ఇక్కడ కూడా అదిరిపోయే రెస్పాన్స్ను దక్కించుకుంది.
ఈ సినిమాతో అదిరిపోయే గుర్తింపును సాధించిన దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రస్తుతం కేజీఎఫ్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.
కాగా ఈ సినిమా తరువాత తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్తో కలిసి ప్రశాంత్ నీల్ ఓ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ రెడీ అయ్యాడు.
ఇక ఈ సినిమా ఇంకా అనౌన్స్ చేయకముందే, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో ఓ సినిమా చేసేందుకు ప్రశాంత్ నీల్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను పూర్తి మాఫియా బ్యాక్డ్రాప్తో తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్ చూస్తున్నాడట.
త్వరలోనే ఈ కథను ప్రభాస్కు వినిపించి సినిమాను ఓకే చేయించాలని చూస్తున్నాడు.
మరి ప్రభాస్ కోసం మాఫియా బ్యాక్డ్రాప్ కథను పట్టుకొస్తున్న ఈ డైరెక్టర్, ఈ సినిమాలో ప్రభాస్ను ఏ రేంజ్లో చూపిస్తాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చని చిత్ర వర్గాలు అంటున్నాయి.
అయితే ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, తన నెక్ట్స్ మూవీని ‘మహానటి’ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్తో కలిసి తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను సూపర్ హీరో బ్యాక్డ్రాప్తో దర్శకుడు తెరకెక్కించాలని చూస్తున్నాడు.
మరి మాఫియా కథకు ప్రభాస్ ఓకే అంటాడా లేడా అనేది చూడాలి.