కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ వైడ్ పాపులారిటీ సంపాదించుకొని స్టార్ దర్శకుడుగా మారిపోయిన వ్యక్తి ప్రశాంత్ నీల్.ప్రస్తుతం ఈ టాలెంటెడ్ దర్శకుడు కేజీఎఫ్ చాప్టర్ 2 కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ చేశాడు.
మరో వైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.
ఇక సెకండ్ షెడ్యూల్ కి ప్రస్తుతం రంగం సిద్ధం అవుతుంది.ఇదిలా ఉంటే సలార్ సినిమాని ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా రేంజ్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ దర్శకుడు గురించి సౌత్ లో ఓ హాట్ న్యూస్ వినిపిస్తుంది.సలార్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ఏకంగా ఐదుగురు స్టార్ హీరోలని లైన్ పెట్టాడని తెలుస్తుంది.
ఇక వారందరితో పాన్ ఇండియా సినిమాలనే ప్లాన్ చేస్తున్నాడు.
సలార్ పూర్తికాగానే మైత్రీ మూవీ మేకర్స్ లో ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ ఒక సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నాడు. త్రివిక్రమ్, తారక్ సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.దీని తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అర్జున్ తో ఓ పాన్ ఇండియా మూవీకి కూడా ఈ మధ్య చర్చలు జరిగినట్లు టాక్ వినిపిస్తుంది.
వీటి తర్వాత రామ్ చరణ్ తో పాటు, తమిళ్ స్టార్ హీరో విజయ్ తో కూడా ఒక మూవీ ప్లానింగ్ చేసుకుంటున్నాడు అని తెలుస్తుంది.అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఇప్పటికే ఓ కథ చెప్పడం జరిగిందని అది కూడా ఫైనల్ అయ్యిందని తెలుస్తుంది.
ఇలా ఏకంగా ఐదుగురు స్టార్ హీరోలతో ప్రశాంత్ నీల్ వరుస ప్రాజెక్ట్ లని లైన్ లో పెట్టుకొని తన కెరియర్ ని ప్లాన్ చేసుకున్నట్లు టాక్ నడుస్తుంది.