ప్రభాస్, ఎన్టీఆర్‌లు కాదు.. చరణ్‌కే ఓటేసిన డైరెక్టర్!

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయగా, అన్ని చోట్లా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.

 Prasanth Neel Movie With Ram Charan, Prasanth Neel, Ram Charan, Ntr, Prabhas, Kg-TeluguStop.com

ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీఎఫ్ చాప్టర్ 2ను తెరకెక్కిస్తున్నాడు చిత్ర డైరెక్టర్.కాగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తయ్యింది.

ఇక ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ టాలీవుడ్ హీరోతో ఓ పాన్ ఇండియా మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ ఓ భారీ సినిమాను ప్లాన్ చేస్తున్నాడని గతకొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలో నిజం లేదని, ప్రశాంత్ నీల్ తన నక్ట్స్ మూవీని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడనే వార్త వినిపిస్తోంది.

కానీ ఇది కూడా కేవలం పుకారేనని, ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చిత్రం తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.

తారక్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉండగా, ఆ తరువాత త్రివిక్రమ్ చిత్రంలో నటిస్తాడు.

ఇక ప్రభాస్ రాధేశ్యామ్ తరువాత నాగ్ అశ్విన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఈ ఇద్దరు హీరోలు బిజీగా ఉండటంతో ప్రశాంత్ నీల్ రామ్ చరణ్‌కు ఓటేసినట్లు తెలుస్తోంది.

కాగా రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తరువాత ఇంకా ఏ సినిమాకు ఓకే చేయకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది.మరి ప్రశాంత్ నీల్ తన నెక్ట్స్ చిత్రాన్ని నిజంగానే రామ్ చరణ్‌తో తెరకెక్కిస్తాడా లేదా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube