రామ్ చరణ్ తో కలవబోతున్న ప్రశాంత్ నీల్

కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా దేశం మొత్తాన్ని తన వైపు చూసేలా చేసుకున్న టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ నీల్.ఈ సినిమా కంటే ముందుగా కన్నడంలో రెండే రెండు సినిమాలు ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు.

 Prasanth Neel And Ram Charan Combination, Tollywood, Telugu Cinema, South Cinema-TeluguStop.com

కేజీఎఫ్ లాంటి మాస్ హీరోయిక్ స్టోరీని అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించి అందరి ప్రశంసలు సొంతం చేసుకున్నాడు.ఈ సినిమాతో కన్నడ స్టార్ యష్ కూడా ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు.

ఇప్పుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు.ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతుంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంజయ్ దత్, రవీనా టాండన్ లాంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత వచ్చే ఏడాది ప్రశాంత్ నీల్ డార్లింగ్ ప్రభాస్ తో తన నెక్స్ట్ సినిమాని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాడు.

హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతుంది.సలార్ అనే టైటిల్ తో మరో మాస్ పవర్ ఫుల్ మాఫియా కథాంశం తెరపై చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్.

ఇందులో కూడా నెగిటివ్ హీరోయిజం చూపించబోతున్నాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ మెగా కాంపౌండ్ లోకి వస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.

రీసెంట్ గా రామ్ చరణ్ కి ప్రశాంత్ అదిరిపోయే స్టోరీ లైన్ ఒకటి చెప్పినట్లు తెలుస్తుంది.ఈ స్టోరీలైన్ కి చరణ్, చిరంజీవి కూడా ఇంప్రెస్ అయ్యి ఒకే చెప్పడం జరిగిందని సమాచారం.

రెండు నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించడానికి ముందుకొచ్చినట్లు టాక్.రామ్ చరణ్ ఇమేజ్ ని రెట్టింపుచేసే విధంగా ఈ సినిమా ఉంటుందని చర్చించుకుంటున్నారు.

త్వరలో దీనికి సంబంధించి కూడా అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని బోగట్టా.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube