ఫోర్బ్స్ జాబితాలో వైసీపీ రాజకీయ వ్యూహకర్త

భారత్ లో అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను తాజాగా ఫోర్స్ విడుదల చేసింది.దీంట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్ చోటు సంపాదించుకున్నారు.

 Prasanth Kishore In Forbes Top Personalities Of 2020-TeluguStop.com

ప్రస్తుతం బీహార్ లో జేడీయూ ఉపాధ్యక్షుడిగా, సీఎం నితీష్ కుమార్ కు నమ్మిన బంటుగా అయిన మాజీ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దీనిలో స్థానం సంపాదించారు.దీంతో పాటు బీహార్ కు చెందిన కన్హయ్య కుమార్ కూడా ఫోర్స్ జాబితాలో 20 స్థానంలో పేరు సంపాదించారు.

అంతేకాకుండా ఈ దశాబ్దపు రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ కీలక వ్యక్తి కాబోతున్నారు అంటూ ఫోర్బ్స్ మ్యాగజైన్ పేర్కొంది.

ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ఆద్మీ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పని చేయబోతున్నారు.

ఇండియా లోనే అత్యంత ప్రభావితమైన వ్యక్తుల్లో ఒకరిగా ఫోర్బ్స్ సంస్థ గుర్తించడంతో బిజెపి కి ఊహించని షాక్ తగిలింది.అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ప్రశాంత్ కిషోర్ తో చర్చలు జరుపుతున్నారు.

ఇక తమిళనాడులో పీకే డిమాండ్ పెరుగుతూ వస్తోంది.ఇప్పుడు ఆయన ఫోర్బ్స్ జాబితాలో చేరడంతో మరింతగా ఆయన పేరు మార్మోగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube