భారత్ లో అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను తాజాగా ఫోర్స్ విడుదల చేసింది.దీంట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్ చోటు సంపాదించుకున్నారు.
ప్రస్తుతం బీహార్ లో జేడీయూ ఉపాధ్యక్షుడిగా, సీఎం నితీష్ కుమార్ కు నమ్మిన బంటుగా అయిన మాజీ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దీనిలో స్థానం సంపాదించారు.దీంతో పాటు బీహార్ కు చెందిన కన్హయ్య కుమార్ కూడా ఫోర్స్ జాబితాలో 20 స్థానంలో పేరు సంపాదించారు.
అంతేకాకుండా ఈ దశాబ్దపు రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ కీలక వ్యక్తి కాబోతున్నారు అంటూ ఫోర్బ్స్ మ్యాగజైన్ పేర్కొంది.
ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ఆద్మీ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పని చేయబోతున్నారు.
ఇండియా లోనే అత్యంత ప్రభావితమైన వ్యక్తుల్లో ఒకరిగా ఫోర్బ్స్ సంస్థ గుర్తించడంతో బిజెపి కి ఊహించని షాక్ తగిలింది.అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ప్రశాంత్ కిషోర్ తో చర్చలు జరుపుతున్నారు.
ఇక తమిళనాడులో పీకే డిమాండ్ పెరుగుతూ వస్తోంది.ఇప్పుడు ఆయన ఫోర్బ్స్ జాబితాలో చేరడంతో మరింతగా ఆయన పేరు మార్మోగుతోంది.