కే జి ఎఫ్ సినిమా తో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.చేసినవి మూడు సినిమాలే అయినా కూడా తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమాని సంగతి తెరకెక్కిస్తున్న తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా సింగరేణి లో స్టార్ట్ అయింది.యాక్షన్ సీక్వెన్స్ తో ఫస్ట్ షెడ్యూల్ ప్రశాంత్ స్టార్ట్ చేశారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఉండబోతోంది అనే విషయం ఇప్పటికే ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చాడు.కేజిఎఫ్ తరహాలోనే ఈ సినిమా కూడా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడంలో వచ్చిన ఉగ్రం సినిమాకి రీమేక్ అని ప్రచారం జరిగింది.అలాగే హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో ఈ సినిమాని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడని కూడా రూమర్స్ వినిపించాయి.
వీటిపై తాజాగా ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు.సలార్ సినిమా పూర్తి కొత్త కథాంశంతో తెరకెక్కుతుందని, కథా కథనాలు పూర్తిగా కొత్తగా ఉంటాయని కేవలం ప్రభాస్ ను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమా కథని తాను తయారు చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు.ఉగ్రం సినిమా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అలాగే తాను ఈ హాలీవుడ్ బాలీవుడ్ కథలని స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమా చేయడం లేదని స్పష్టం చేశాడు.సలార్ సినిమా ప్రతి ఒక్కరిని మెప్పించే విధంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
దీంతో ఎంత వరకు ఈ సినిమా పై వినిపిస్తున్న రూమర్స్ పై పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చినట్లు అయ్యింది.