కరోనా ఎఫెక్ట్ ప్రపంచంతో పాటు దేశంలో కూడా ఎక్కువగానే ఉంది.ప్రస్తుతం ఇండియాలో కరోనా మూడో స్టేజిలో ఉంది.
ఈ స్టేజి నుంచి నాలుగో స్టేజికి వెళ్ళకుండా ఉండటానికి దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు.అయితే ఈ విషయం తెలిసి కూడా ప్రజలు చాలా నిర్లక్ష్యంగా బయటకి వస్తున్నారు.
వీరిని కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీలకి పని చెబుతున్నారు.ఇదిలా ఉంటే ఇక కరోనాపై ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా సెలబ్రిటీలు తమ ఉదారత చాటుకుంటూ ముందుకొచ్చారు.
పెద్ద మొత్తంలో విరాళాలు అందించారు.
అయితే ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినపుడు హీరోలు ఉండేంత ఫాస్ట్ గా హీరోయిన్స్ ఉండరు.
రెమ్యునరేషన్ విషయంలో హీరోలకి ఎక్కువ ఇస్తున్నారు అని గోల చేసే భామలు సాయంలో హీరోలు మాదిరిగా ముందుకి రారు.అయితే వీరిలో కన్నడ భామ ప్రణీత మాత్రం డిఫరెంట్.
ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చిన నేనున్నాను అంటూ తన ఫౌండేషన్ ద్వారా ఎంతో కొంత సాయం చేస్తుంది.కర్ణాటకలో వచ్చిన వరదల సమయంలో కూడా ప్రణీత పెద్ద మనసు చాటుకుంది.
ఇప్పుడు కరోనా నేపధ్యంలో ఎంతో మంది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.ఈ నేపధ్యంలో మరో సారి తన గొప్ప మనసు చూపిస్తూ ప్రణీత ఫౌండేషన్ ద్వారా 50 కుటుంబాలకి రెండు వేల చొప్పున సాయం అందించింది.
తను సంపాదించిన దాంట్లోనే కలిగినంతలో సాయం చేసి హీరోయిన్స్ కూడా తనలా ఉండాలని చెప్పింది.