టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తక్కువ సినిమాల్లోనే నటించినా హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బాపు బొమ్మ ప్రణీత.ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రణీతకు తొలి సినిమా సక్సెస్ కాకపోయినా నటిగా మంచి పేరు వచ్చింది.
ఆ తరువాత బావ, అత్తారింటికి దారేది, రభస, పాండవులు పాండవులు తుమ్మెద, ఇతర సినిమాల్లో ప్రణీత నటించింది.అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలో హీరోయిన్ అయినా ఆ సినిమా తరువాత ప్రణీత నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆమెకు అవకాశాలు తగ్గాయి.
గత కొన్నేళ్లుగా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో టాలీవుడ్ కు దూరమైన ప్రణీత ముఖానికి సూదులు గుచ్చుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది.అయితే అలా ముఖానికి సూదులు ఊరికే గుచ్చుకోలేదని.
ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో ముఖానికి సూదులు గుచ్చుకోవడం కూడా ఒక భాగమని ప్రణీత చెబుతోంది.సూదులను ముఖానికి గుచ్చడం ద్వారా వ్యాధులను నయం చేయవచ్చని వెల్లడిస్తోంది.
చాలా సంవత్సరాల క్రితం చైనా దేశంలో ఈ విధానం ద్వారానే రోగులకు చికిత్స జరిగేది.ఆ పురాతన వైద్యాన్ని ప్రణీత కూడా చేయించుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపింది.అయితే ఆ చికిత్స చేయించుకోవడానికి గల కారణాలను, చికిత్స చేయడం వల్ల ఉపయోగాలను మాత్రం ఆమె వెల్లడించలేదు.అయితే సినిమాల ద్వారా దూరమైనా సోషల్ మీడియా ద్వారా ఆమె యాక్టివ్ గా ఉంటూ పోస్ట్ లు పెడుతోంది.
కొన్ని రోజుల క్రితం మాల్దీవులకు వెళ్లిన ప్రణీత సోషల్ మీడియాలో మాల్దీవులలో దిగిన ఫోటోలను షేర్ చేసింది.సినిమాల్లో ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రల్లో నటించడం ఆమె కెరీర్ కు మైనస్ గా మారిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.