ప్రణయ్ 'ఆత్మ' ఆ విషయాలు చెప్తోందా ..?

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్య కారణంగా ప్రాణాలు కోల్పోయిన ప్రణయ్‌… ఆత్మగా మారిపోయాడా? అతని ఆత్మ అమృత చుట్టే తిరుగుతోందా? పోయిన జన్మలో ప్రణయ్‌, మారుతీరావులిద్దరూ బద్ధశత్రువులా? అందుకే ఈ జన్మలో పగ తీర్చుకున్నాడా? ఇప్పుడివే వదంతులు మిర్యాలగూడలో షికారు చేస్తున్నాయి.

 Pranay Soul Do Those Things-TeluguStop.com

అసలు ఈ వదంతులకు కారణం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన నాగారావు, సత్యప్రియ దంపతులు.ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.మిర్యాలగూడలోని ప్రణయ్‌ ఇంటికెళ్లిన వీళ్లిద్దరూ.

అతని తల్లిదండ్రులతో కొద్దిసేపు మాట్లాడారు.అమృతను ఓదార్చారు.

అనంతరం, ప్రణయ్‌ ఆత్మ తమతో రెగ్యులర్‌గా మాట్లాడుతోందని, అనేక విషయాలు చెబుతోందంటూ.కొద్దిసేపు ప్రార్థనలు చేశారు.

విగ్రహం ఏర్పాటు చేయడం ప్రణయ్‌కి ఇష్టం లేదని, ఒకవేళ ఏర్పాటు చేస్తే ఆత్మ అందులోకి వెళ్లిపోతుందని చెప్పారు.పోయిన్‌ జన్మలో ప్రణయ్‌, మారుతీరావులు బద్ధశత్రువులనీ.

ఈ జన్మలో మారుతీరావు పగ తీర్చుకున్నాడని చెప్పుకొచ్చారు.ఆత్మ అమృతకోసం ఎదురుచూస్తోందని, తమతో వస్తే చూపిస్తామని, మాట్లాడిస్తామని చెప్పారు.

నాగారావు దంపతులు చెబుతున్న మాటలపై అనుమానం రావడంతో.పోలీసులను ఆశ్రయించారు ప్రణయ్‌ తల్లిదండ్రులు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగారావు, సత్యప్రియలతో పాటు వారి వెంట వచ్చిన మరోవ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.వీళ్లు గతంలోనూ ఫోన్‌చేసి ప్రణయ్‌ ఆత్మతో మాట్లాడిస్తానని చెప్పారని అమృత చెప్పడంతో.

పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.వచ్చిన వాళ్లెవరు? అమృతను ఎందుకు తీసుకెళ్లాలనుకున్నారు? అనే కోణంలో విచారిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube