కూతురు కుంకుమ చెరిపేసిన మారుతీరావుకి బెయిల్! భయపడుతున్న అమృత

తెలుగు రాష్ట్రాలలో ప్రణయ్ హత్య ఎంత సంచలనం అయ్యిందో అందరికి తెలిసిందే.తక్కువ జాతి వాడిని కూతురు పెళ్లి చేసుకుందని పగ పెంచుకున్న మారుతీరావు, కూతురు కళ్ళముందే అల్లుడుని అతి కిరాతకంగా చంపించాడు.

 Pranay Murderer Marutirao Release On Bail-TeluguStop.com

ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడుగా మారుతీరావుని పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఇక మారుతీరావు ఆరు నెలలు జైలు జీవితం గడిపి తాజాగా బెయిల్ మీద బయటకి వచ్చాడు.

అయితే నడి రోడ్డు మీద అలా పరువు పేరుతో హత్య చేయించిన మారుతీరావుకి బెయిల్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి.

ఇదిలా ఉంటే మరోవైపు మారుతీ రావు బెయిల్ మీద బయటకి రావడంతో అతనికి ఘన స్వాగతం పలుగుతూ ఊరేగింపుగా తీసుకురావడానికి ఏకంగా 20 కాన్వాయ్ లు వెళ్ళడం ఇప్పుడు మిర్యాల గూడ లో సంచలనంగా మారింది.

ఒక వర్గంకి ప్రాతినిధ్యం వహిస్తున్న మారుతీరావు చేసిన పనిని ఆ వర్గానికి చెందిన వారు ఎంతగా సమర్ధిస్తున్నారో అనేది ఇప్పుడు మారుతీరావు విడుదల సందర్భంగా రుజువైంది.ఇదే సమయంలో తన తండ్రి నుంచి తనకి, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని మారుతీరావు కూతురు అమృత జిల్లా ఎస్పీకి కలిసి ఫిర్యాదు చేసింది.

అంత కిరాతకంగా తన భర్తని చంపిన వ్యక్తికి ఎలా బెయిల్ ఇస్తారని దీనిపై పోరాటం చేస్తా అని మీడియా ముందుకి వచ్చి చెప్పింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube