తెలుగు రాష్ట్రాలలో ప్రణయ్ హత్య ఎంత సంచలనం అయ్యిందో అందరికి తెలిసిందే.తక్కువ జాతి వాడిని కూతురు పెళ్లి చేసుకుందని పగ పెంచుకున్న మారుతీరావు, కూతురు కళ్ళముందే అల్లుడుని అతి కిరాతకంగా చంపించాడు.
ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడుగా మారుతీరావుని పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఇక మారుతీరావు ఆరు నెలలు జైలు జీవితం గడిపి తాజాగా బెయిల్ మీద బయటకి వచ్చాడు.
అయితే నడి రోడ్డు మీద అలా పరువు పేరుతో హత్య చేయించిన మారుతీరావుకి బెయిల్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి.
ఇదిలా ఉంటే మరోవైపు మారుతీ రావు బెయిల్ మీద బయటకి రావడంతో అతనికి ఘన స్వాగతం పలుగుతూ ఊరేగింపుగా తీసుకురావడానికి ఏకంగా 20 కాన్వాయ్ లు వెళ్ళడం ఇప్పుడు మిర్యాల గూడ లో సంచలనంగా మారింది.
ఒక వర్గంకి ప్రాతినిధ్యం వహిస్తున్న మారుతీరావు చేసిన పనిని ఆ వర్గానికి చెందిన వారు ఎంతగా సమర్ధిస్తున్నారో అనేది ఇప్పుడు మారుతీరావు విడుదల సందర్భంగా రుజువైంది.ఇదే సమయంలో తన తండ్రి నుంచి తనకి, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని మారుతీరావు కూతురు అమృత జిల్లా ఎస్పీకి కలిసి ఫిర్యాదు చేసింది.
అంత కిరాతకంగా తన భర్తని చంపిన వ్యక్తికి ఎలా బెయిల్ ఇస్తారని దీనిపై పోరాటం చేస్తా అని మీడియా ముందుకి వచ్చి చెప్పింది.