గత సంవత్సరం అత్యంత దారుణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమృత తండ్రి చేతిలో హత్యకు గురైన ప్రణయ్ మళ్లీ పుట్టాడు.ప్రణయ్ కోసం ఎన్నో వేల మంది కన్నీరు కార్చారు.
ప్రణయ్ని చంపిన వ్యక్తిని నడి రోడ్డుపై నరికి చంపాలంటూ అంతా కూడా కోరుకున్నారు.అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ప్రణయ్కి ఈ దారుణమైన శిక్ష.
అమృత తండ్రి మారుతి రావు కిరాయి రౌడీలను పెట్టించి మరీ చంపించాడు.ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న మారుతి రావు పశ్చాతాప పడుతున్నాడో లేదో కాని దోషులకు శిక్ష పడేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ సమయంలో అమృత పండంటి బాబుకు జన్మనిచ్చింది.తన కడుపులో మళ్లీ ప్రణయ్ పుట్టాడంటూ అమృత సంతోషంను వ్యక్తం చేస్తుంది.ప్రణయ్ తల్లిదండ్రులు ఈ విషయాన్ని నిర్థారించారు.తమ తనయుడు అమృత కడుపులో పుట్టినట్లుగా తాము భావిస్తున్నట్లుగా ఆనంద బాష్పాలు కారుస్తున్నారు.అమృత మిర్యాలగూడంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో బాబుకు జన్మనిచ్చింది.
అమృతపై హత్య యత్నం జరగవచ్చు అనే ఉద్దేశ్యంతో పోలీసులు అప్పటి నుండి కూడా రక్షణ కల్పిస్తున్నారు.ప్రణయ్ చనిపోయిన తర్వాత అమృత కుటుంబ సభ్యులు వచ్చి గర్బస్రావం చేయించుకుని, వేరే పెళ్లి చేసుకో అంటూ ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారు.కాని తన కడుపులో ఉన్నది ప్రణయ్ అంటూ అమృత ఎట్టి పరిస్థితుల్లో గర్బస్రావంకు ఒప్పుకోలేదట.
మొత్తానికి ప్రణయ్ మళ్లీ పుట్టాడంటూ అమృత మరియు ఆమె అత్తవారు చాలా సంతోషంగా ఉన్నారు.