వయసు ఉన్నంత కాలం పనులలో పడి అన్ని ఉన్న సరే మనకు కావాల్సిన ఆహారం తీసుకోలేము.కానీ వయసు అయిపోయాకా.
ఏది తిన్న జీర్ణించుకోలేని సమయంలో అన్ని తినాలనిపిస్తుంది.ఇంకా అలానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా కొడుకును ఓ కోరిక కోరాడు.
అయితే ఆ కోరిక 15 రోజుల క్రితం అడిగాడు లెండి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ప్రణబ్ ముఖర్జీ తీవ్ర అస్వస్థతతో ఆర్మీ ఆసుపత్రిలో చేరడానికి ఓ వారం రోజుల క్రితం తన కుమారుడు, బెంగాల్ రాజకీయాల్లో ఉన్న అభిజిత్కు ఫోను చేసి పనసపండు తినాలని ఉందని, తెచ్చిపెట్టమని అడిగారట.ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా మీడియాకు తెలిపాడు.అభిజిత్ మాట్లాడుతూ.”కోల్కతా నుంచి పనసపండు తెచ్చిపెట్టమని నాన్నగారు కోరారు.
దీంతో నేను వెంటనే బిర్హూం జిల్లాలోని మా ఊరికి వెళ్లి అక్కడ 25 కిలోల పనస పండును కోయించి దానిని ఆగస్టు 3 వ తేదీన రైలులో ఢిల్లీకి తీసుకువెళ్లి నాన్న గారికి ఇచ్చాను.నాన్న గారు ఎంతో ఇష్టంగా కొన్ని పనస పళ్ళని తిన్నారు అప్పటికి అయన షుగర్ లెవల్స్ కూడా నార్మల్ గానే ఉన్నాయ్.
పనస పళ్ళు తిని అయన ఎంతో ఆనందించారు అని తెలిపారు.ప్రస్తుతం అయన ఆరోగ్యం నిలకడగా ఉందని అభిజిత్ తెలిపారు.